News March 30, 2025
ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 164 ప్రైవేట్ ఆస్పత్రులు!

TG: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేటు ఆస్పత్రులను చేర్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో 1,042 ఆస్పత్రులుండగా, ఇందులో 409 ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వం చికిత్స ఖర్చును రూ.10 లక్షలకు పెంచడంతోపాటు మొత్తంగా 1,835 వ్యాధులను చేర్చింది. దీంతో 2024-25లో 3.53 లక్షల మంది చికిత్స చేయించుకున్నారు.
Similar News
News April 20, 2025
మెగా డీఎస్సీ కాదు మెగా డ్రామా: వైసీపీ

AP: మెగా డీఎస్సీపై సంతకం చేసిన 10 నెలలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ Xలో విమర్శించింది. ఇది మెగా డీఎస్సీ కాదు మెగా డిసప్పాయింట్మెంట్ అని మండిపడింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో, ఎప్పుడు నియామకపత్రాలు ఇస్తారనే విషయమై స్పష్టత లేదని విమర్శించింది. ఈ మెగా డ్రామా పూర్తిగా పబ్లిక్ స్టంట్ అని దుయ్యబట్టింది.
News April 20, 2025
రేపు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాల్లో <
News April 20, 2025
తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: సీఎం చంద్రబాబు

AP: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ CM చంద్రబాబు ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు అందించిన శుభాకాంక్షలు, చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాకు తోడునీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నారు.