News March 29, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వర స్వామిని 65,992 మంది దర్శించుకోగా.. 25,698 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Similar News

News April 17, 2026

దొరికిపోయిన ‘జననాయగన్’ లీక్ దొంగలు

image

విజయ్ సినిమా ‘జననాయగన్’ లీక్ కేసును పోలీసులు ఛేదించారు. ఓ ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ సినిమా స్టూడియో సెక్యూరిటీని దాటుకొని మరీ డిజిటల్ రీల్స్‌ను దొంగిలించినట్లు గుర్తించారు. వేరే ప్రాజెక్టులో పని చేస్తూ ఎడిటింగ్ రూమ్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నిందితుడు.. డేటాను దొంగిలించి మరో ఇద్దరికి చేరవేశాడు. దీంతో సినిమా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 17, 2026

‘గరుడ’ విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు?

image

వినత కుమారుడైన గరుడుడు తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి కద్రువ కోరిక మేరకు దేవలోకం నుంచి అమృతాన్ని తెస్తాడు. అపారమైన శక్తి ఉన్నా, అమృతంపై ఆశ పడడు. తల్లి కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆయన ధైర్యం మహావిష్ణువును మెప్పించాయి. దీంతో విష్ణుమూర్తి, అతనికి చిరంజీవిత్వం ప్రసాదించి తన వాహనంగా, ధ్వజంగా స్వీకరించారు. గరుడుడు సముద్రాలను దాటగలడు. వేగవంతుడు. విష్ణు సాయం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

News April 17, 2026

IPL: బోణీ కొట్టి బోల్తా పడింది!

image

ఐదుసార్లు ఛాంపియన్ MI ఈ IPLలో దారుణంగా ఆడుతోంది. తొలి మ్యాచులో KKRపై గెలిచి బోణీ కొట్టిన ఆ జట్టు తర్వాత 4 మ్యాచుల్లోనూ ఓడిపోయింది. దీంతో -1.076 నెట్‌రన్‌తో పాయింట్ల టేబుల్‌లో చివరి నుంచి రెండో ప్లేసులో నిలిచింది. జట్టులో సీనియర్లు రోహిత్, సూర్య, హార్దిక్, తిలక్ గొప్పగా రాణించడం లేదు. పేసర్లలో బుమ్రా, చాహర్ తేలిపోతున్నారు. పాండ్య కెప్టెన్సీపైనా అటు ప్లేయర్లు, ఇటు ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.