News February 16, 2025

18 మంది దుర్మరణం.. కారణమిదే: రైల్వే శాఖ

image

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ‘నిన్న ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైంది. 14వ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో 12వ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేక రైలును ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడికి కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. ఈ ఘటన దురదృష్టకరం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొంది.

Similar News

News November 20, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

* ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. ఇవాళ చైనీస్ తైపీకి చెందిన గువాయి గ్జువాన్‌తో అమీతుమీ
* బధిర ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్)లో ఇప్పటివరకు 11 పతకాలు సాధించిన భారత షూటర్లు
* టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్-2026’కు ఎంపికైన దిగ్గజ ప్లేయర్ ఫెదరర్
* ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లో లక్ష్య సేన్, ప్రణయ్
* ఝార్ఖండ్‌తో రంజీ మ్యాచులో ఆంధ్ర విజయం

News November 20, 2025

ఆగని పైరసీ.. కొత్తగా ‘ఐబొమ్మ వన్’

image

ఆన్‌లైన్‌లో మరో పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. కొత్తగా ‘ఐబొమ్మ వన్’ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్‌సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్‌ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

News November 20, 2025

రైతులకు బాబు వెన్నుపోటు: YCP

image

AP: ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు రైతులకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ విమర్శించింది. అన్నదాత సుఖీభవ పథకం తొలి రెండు విడతల్లో <<18329772>>7 లక్షల మంది<<>> లబ్ధిదారులను తొలగించారని ఆరోపించింది. వైసీపీ హయాంలో 53.58 లక్షల మందికి ఈ పథకం కింద డబ్బులు అందేవని వెల్లడించింది. అలాగే పంటలకు మద్దతు ధరలు కూడా ఇవ్వట్లేదని ట్వీట్ చేసింది.