News January 22, 2025

అమెరికా నుంచి 18000 మంది వెనక్కి!

image

డొనాల్డ్ ట్రంప్ పాలసీలకు తగినట్టు భారత్ ప్రణాళికలు వేసుకుంటోంది. USతో అనవసరంగా ట్రేడ్‌వార్ తెచ్చుకోకుండా ఉండేందుకు 18,000 అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. 2 దేశాలూ కలిసి వీరిని గుర్తించాయి. స్టూడెంట్, వర్క్ వీసాలతో లీగల్‌గా అక్కడికి వెళ్లినవారికి అడ్డంకులు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లేదంటే వీసాలు, గ్రీన్‌కార్డులు తగ్గించి ట్రంప్ తిప్పలు పెట్టొచ్చు.

Similar News

News July 11, 2025

ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

image

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <>ఆధార్ వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వాలి. LOCK/ UNLOCK ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి బయోమెట్రిక్స్ తాత్కాలిక/పర్మినెంట్‌ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. CONSENT బాక్స్‌పై క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. SHARE IT

News July 11, 2025

జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

image

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News July 11, 2025

ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

image

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.