News June 17, 2024
హజ్ యాత్రలో 19 మంది యాత్రికులు మృతి
ముస్లింల పవిత్ర హజ్ యాత్రలో ఎండ వేడికి తాళలేక 19 మంది యాత్రికులు మరణించారు. వీరంతా జోర్డాన్, ఇరాన్కు చెందిన వారని అధికారులు తెలిపారు. అధికారులు ఎండ నుంచి ఉపశమనం కలిగించే ఏర్పాట్లు చేసినా మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మక్కాలో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఎండలకు తాళలేక 240 మంది మరణించారు. కాగా ఎల్లుండితో హజ్ యాత్ర ముగియనుంది.
Similar News
News June 26, 2024
స్వర్గంలో భూమిని కొనొచ్చు.. ధర ఎంతంటే?
స్వర్గంలో భూమి కొనడమేంటని ఆలోచిస్తున్నారా? స్పానిష్-పోర్చుగీస్ వంశానికి చెందిన ఓ క్రిస్టియన్ చర్చి స్వర్గంలో స్థలాలను విక్రయిస్తోంది. చర్చి పాస్టర్ తాను 2017లో దేవునితో మాట్లాడానని, చదరపు మీటర్ ధర $100 ఉంటుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన బ్రోచర్ నెట్టింట వైరలవుతోంది. ఇది అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్గా మారిందని, చర్చి ఇప్పటికే మిలియన్ డాలర్లను సేకరించిందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News June 26, 2024
AUSపై భారత్ విజయం.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు
ఆస్ట్రేలియాతో సూపర్-8 మ్యాచ్లో భారత్ బాల్ ట్యాంపరింగ్ చేసి గెలిచిందని పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆరోపణలు చేశారు. కొత్త బంతిని అర్ష్దీప్ 16వ ఓవర్లో ఎలా రివర్స్ స్వింగ్ చేయగలిగారని, అంటే బంతి 12 లేదా 13వ ఓవర్లోనే రివర్స్ స్వింగ్కు అనుకూలంగా మారిందా? అని ప్రశ్నించారు. అంపైర్లు కళ్లు తెరిచి ఉండాలని సూచించారు. ఈ మ్యాచ్లో భారత్ 205 రన్స్ చేయగా ఛేదనలో ఆస్ట్రేలియా 181 పరుగులకే పరిమితమై ఓడింది.
News June 26, 2024
ఇది కదా సక్సెస్ అంటే!
రాజస్థాన్లోని దళిత కుటుంబానికి చెందిన మహిళ రాజకీయాల్లోకి రావడమే గ్రేట్. అలాంటిది 26 ఏళ్ల సంజనా జాటవ్ MPగా గెలిచి ఫ్యామిలీతో పార్లమెంట్కు వచ్చారు. తల్లి, అత్తామామల ఆశీర్వాదం తీసుకొని భరత్పూర్ MPగా ప్రమాణం చేశారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు అత్తామామలను ఒప్పించానని, MLAగా ఓడిపోయినా కాంగ్రెస్ తనను నమ్మి లోక్సభ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె కుటుంబం ఫొటో వైరలవుతోంది.