News April 5, 2025
EAPCETకు 2.91లక్షల దరఖాస్తులు

TG EAPCET దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. నిన్న సాయంత్రం వరకు మొత్తం 2,91,965 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్కు 2,10లక్షలు, అగ్రికల్చర్కు 81,172, రెండింటి కోసం 226 మంది అప్లై చేశారు. దరఖాస్తు చేసుకోని వారు రూ.200 ఆలస్య రుసుముతో ఈనెల 8 వరకు, రూ.500 లేట్ ఫీజుతో 14వ తేదీ వరకు, రూ.5వేలతో ఈనెల 24 వరకు అప్లై చేసుకోవచ్చు.
Similar News
News April 20, 2025
కాబోయే భార్య వేధింపులు.. అధికారి సూసైడ్

కాబోయే భార్య వేధింపులు తాళలేక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్న ఘటన MHలో జరిగింది. నాసిక్కు చెందిన హరేరామ్(36), వారణాసి యువతి మోహినికి ఎంగేజ్మెంట్ జరిగింది. మోహిని తన లవర్ను హగ్ చేసుకోవడం చూసి హరేరామ్ నిలదీశాడు. విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బెదిరించింది. మానసిక ఒత్తిడికి లోనైన హరేరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి, ఆమె లవర్పై కేసు నమోదైంది.
News April 20, 2025
డీలిమిటేషన్కు మేం వ్యతిరేకం కాదు: స్టాలిన్

డీలిమిటేషన్కు తాము వ్యతిరేకం కాదని, న్యాయబద్ధంగా చేయాలనే కోరుతున్నామని తమిళనాడు CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘త్వరలో జరగబోయే జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేస్తామనడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలా చేస్తే సౌత్ స్టేట్స్కు నష్టం. వాయిదా వేసి సమన్యాయం జరిగేలా చూడాలంటున్నాం. హిందీ వల్ల నార్త్లో ఎన్నో రాష్ట్రాలు మాతృ భాషను కోల్పోయాయి. TNలో ఆ పరిస్థితి రానివ్వం’ అని వ్యాఖ్యానించారు.
News April 20, 2025
సౌత్లో హీరోయిన్లను జూమ్ చేసి మరీ..: మాళవిక

దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా దృష్టి పెడతారని హీరోయిన్ మాళవిక మోహన్ అన్నారు. నడుము ఒంపులు ఎక్కువగా ఉన్న హీరోయిన్లను వారు ఇష్టపడతారని చెప్పారు. ‘నేను ముంబైలో పెరిగా కాబట్టి నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. హీరోయిన్ల ఫొటోలు చూసేటప్పుడు వారి శరీర భాగాలను జూమ్ చేసి మరీ చూస్తారు. అందులోనూ నాభిని ఎక్కువగా చూస్తారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.