News February 19, 2025
2 రోజులు సెలవు

AP: పట్టభద్రుల, టీచర్స్ MLC స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో(ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్స్) 2 రోజులు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు FEB 26, పోలింగ్ రోజైన 27 తేదీల్లో సెలవు ఇవ్వాలని, అవసరమైతే కౌంటింగ్(MAR 3) రోజునా సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం 16 జిల్లాల్లో MLC ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Similar News
News January 12, 2026
2026లో యుగాంతం.. నిజమెంత?

కొత్త ఏడాది ప్రారంభమైన ప్రతిసారీ ‘యుగాంతం’ థియరీలు ముందుకొస్తుంటాయి. బాబా వాంగ వంటి వారిని పేర్కొంటూ ఊహాగానాలు పుట్టుకొస్తాయి. AI ప్రాముఖ్యత, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి దానికి సంకేతాలంటూ SMలో స్టోరీలు ఇప్పుడు వైరలవుతున్నాయి. ఏలియన్స్ భూమిని ఆక్రమిస్తారనే చర్చా జరుగుతుంది. వీటిలో ఏమాత్రం నిజం ఉండదని చరిత్ర చెబుతోంది. కేవలం SM ఆల్గారిథమ్ వల్లే ఇవి ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి.
News January 12, 2026
RVNLలో ఇంజినీర్ పోస్టులు

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(<
News January 12, 2026
ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేయసి సోఫీతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు చేతికి రింగ్ ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.


