News August 11, 2025
ఉమ్మడి కృష్ణాలో త్వరలో 2డిఫెన్స్ కేంద్రాలు

AP: ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 డిఫెన్స్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. నాగాయలంక గొల్లలమొద వద్ద మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం నెలకొల్పుతామని PM ప్రకటించడం తెలిసిందే. అటు బ్రహ్మోస్ క్షిపణి కేంద్రం కోసం జగ్గయ్యపేట జయంతిపురం ప్రాంతాన్ని డిఫెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ NHకు దగ్గర్లో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో అనుకూలమని భావిస్తున్నారు. ఇవి పట్టాలెక్కితే వేల మందికి ఉపాధి లభిస్తుంది.
Similar News
News March 13, 2026
నేనూ రైతు బిడ్డనే: చంద్రబాబు

AP: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చే ₹6 వేలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ₹14 వేలు కలిపి ఏటా ప్రతి రైతు ఖాతాలో ₹20 వేలు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. తాను కూడా రైతు బిడ్డనేనని.. వారి కష్టాలు తనకు తెలుసని, అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
News March 13, 2026
మనిషి శరీరంలో గోల్డ్ ఉంటుందని తెలుసా?

మన శరీరంలోనూ బంగారం ఉంటుందని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. 70KGల బరువున్న మనిషి శరీరంలో దాదాపు 0.2mgల గోల్డ్ ఉంటుంది. చాలా తక్కువ పరిమాణంలో రక్తంలో కరిగి ఉంటుంది కాబట్టి దీనిని వేరు చేయడం సాధ్యపడదు. ఇది కీళ్ల ఆరోగ్యానికి దోహదపడుతుందని, శరీరంలో విద్యుత్ సంకేతాలకు మద్దతు ఇస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 13, 2026
ప్రతి సినిమాకు సబ్టైటిల్స్ కరెక్టేనా.. మీరేమంటారు?

అన్ని సినిమాలకు సబ్టైటిల్స్, ఆడియో డిస్క్రిప్షన్ తప్పనిసరి చేస్తూ CBFC తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వినికిడి, దృష్టిలోపం ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. సబ్టైటిల్స్ వల్ల విజువల్ ఎక్స్పీరియన్స్ దెబ్బతింటుందని, మూవీని ఎంజాయ్ చేయలేమని మరికొందరు విమర్శిస్తున్నారు. నటుల యాక్టింగ్ను కాకుండా అక్షరాలు చూడాల్సి వస్తుందంటున్నారు. మరి మీరేమంటారు?


