News January 1, 2025

అయోధ్య రామయ్యను దర్శించుకున్న 2 లక్షల మంది

image

అయోధ్యలోని బాల రాముడి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తుండగా ఇప్పటికే 2 లక్షల మంది రామ్‌లల్లాను దర్శించుకున్నట్లు రామజన్మభూమి ట్రస్ట్ పేర్కొంది. రాత్రి 9 గంటల వరకు ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. మీలో ఎవరైనా అయోధ్యకు వెళ్లారా? ఇవాళ ఏ ఆలయాలను సందర్శించారో కామెంట్ చేయండి.

Similar News

News January 20, 2025

ట్రంప్ పార్టీ: నీతా అంబానీ కాంచీపురం పట్టుచీర స్పెషాలిటీ ఇదే!

image

డొనాల్డ్ ట్రంప్ ప్రైవేటు రిసెప్షన్‌లో నీతా అంబానీ కట్టుకున్న పట్టుచీరపై నెట్టింట చర్చ జరుగుతోంది. జాతీయ అవార్డు గ్రహీత బీ కృష్ణమూర్తి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. పురాణాల్లో కాంచీపురం మందిరాల ప్రాముఖ్యాన్ని శోధించి 100+ మోటిఫ్స్‌ డిజైన్ చేశారు. విష్ణువును ప్రతిబింబించేలా 2 తలల గరుడపక్షి, అమృతత్వం, దైవత్వానికి గుర్తుగా నెమళ్లను నేయించారు. దీనికి తోడుగా 18వ శతాబ్దపు వారసత్వ నగను నీతా ధరించారు.

News January 20, 2025

నేను నేరం చేయలేదు: సంజయ్ రాయ్

image

తాను తప్పు చేయలేదని కలకత్తా హత్యాచార ఘటన దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. తీర్పు ఖరారుపై కాసేపటి క్రితం సీల్దా కోర్టులో వాదనలు ప్రారంభం కాగా, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నాడు. కాగా 2024 AUG 9న RG Kar ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ దారుణ హత్యాచారానికి గురైంది. ఆ మరుసటి రోజు మాజీ పోలీస్ కాంట్రాక్టు ఉద్యోగి <<15203033>>సంజయ్<<>> ఈ కేసులో అరెస్టయ్యాడు.

News January 20, 2025

‘హిండెన్‌బర్గ్’ అండర్సన్‌పై మోసం కేసు నమోదుకు ఆస్కారం!

image

US షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ యజమాని అండర్సన్‌పై సెక్యూరిటీ ఫ్రాడ్ కేసు నమోదవ్వొచ్చని సమాచారం. కంపెనీలే టార్గెట్‌గా రిపోర్టులు రూపొందించేందుకు హెడ్జ్‌ఫండ్ కంపెనీలతో కుమ్మక్కైనట్టు ఆంటారియో కోర్టులో దాఖలైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. షేర్ల ట్రేడింగులో పాల్గొంటున్నట్టు చెప్పకుండా బేరిష్ రిపోర్టులను రూపొందించడం US SEC ప్రకారం నేరమని ఆ నివేదిక నొక్కిచెప్పింది. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం తెలిసిందే.