News April 2, 2025

2.O భిన్నంగా ఉంటుంది: జగన్

image

AP: వచ్చే ఎన్నికల్లో YCP భారీ మెజారిటీతో గెలుస్తుందని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. కరోనా వల్ల కార్యకర్తలకు నేను చేయాల్సినంత చేసుండకపోవచ్చు. ఈసారి జగన్ 2.O భిన్నంగా ఉంటుంది. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతా. రాబోయే రోజులు మనవే’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు. హామీలు ఎగ్గొట్టడానికి అప్పులపై CBN అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

Similar News

News April 25, 2025

నేడు ఢిల్లీకి సీఎం.. PMకు ‘అమరావతి’ ఆహ్వానం

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మే 2న అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆయన ఆహ్వానిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణమై రాత్రి 9 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

News April 25, 2025

మరో సంచలన నిర్ణయం దిశగా భారత్?

image

ఉగ్రదాడి తర్వాత పాక్‌పై దౌత్యచర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. FEB 24, 2021న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయనున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఉగ్ర సంస్థలు కశ్మీర్‌లోకి చొరబడటంతోపాటు తరచూ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడుతోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసి మన సైన్యానికి అదనపు బలం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.

News April 25, 2025

SC గురుకులాల్లో ప్రవేశాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

TG: రాష్ట్రంలోని 239 ఎస్సీ గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో సీట్లు ఉంటాయి. టెన్త్ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://tgswreis.cgg.gov.in/

error: Content is protected !!