News October 8, 2025
కోల్డ్రిఫ్ సిరప్కు 20 మంది పిల్లలు బలి!

మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ మరణాల సంఖ్య 20కి చేరినట్లు Dy.CM రాజేంద్ర శుక్ల వెల్లడించారు. నాగ్పూర్లో ఆస్పత్రులను ఆయన సందర్శించారు. కలుషిత సిరప్ తాగి మరో ఐదుగురి కిడ్నీలు పాడైపోయాయని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో చింద్వారాకు చెందిన వారే 17 మంది ఉన్నారని చెప్పారు. ఫీవర్, జలుబు ఉన్న పిల్లలు సిరప్ తాగడంతో వాంతులు, మూత్ర విసర్జన సమస్యలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు.
Similar News
News October 8, 2025
గణపతి పూజలో తులసి ఆకులను ఎందుకు వాడరు?

తులసీ దేవి, గణేషుణ్ని చూసి తనను వివాహం చేసుకొమ్మని అడుగుతుంది. కానీ నిరాకరిస్తాడు. దీంతో ఆమె కోపంతో బ్రహ్మచారిగా ఉంటావని శపిస్తుంది. ప్రతిగా గణేషుడు ఆమెను రాక్షసుని చెంత ఉండమని శపించాడు. ఆయన శాపానికి చింతించిన ఆమె మన్నించమని అడిగింది. గణేషుడు శాంతించి పవిత్రమైన మొక్కగా జన్మిస్తావని వరమిస్తాడు. కానీ తన పూజలో ఆ పత్రం ఉండటాన్ని నిరాకరిస్తాడు. ఆయన పూజలో తులసి ఆకులు వాడితే పూజాఫలం దక్కదని ప్రతీతి.
News October 8, 2025
విజయ్ దేవరకొండ కొత్త సినిమా అప్డేట్!

విజయ్ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్దన’ టైటిల్తో ఓ సినిమా తీయనున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఈనెల 11న లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 16వ తేదీ నుంచి ముంబైలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ‘రాజావారు రాణిగారు’ సినిమా ఫేమ్ రవి కిరణ్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తారని సమాచారం.
News October 8, 2025
కనకాంబరంలో ఎండు తెగులు నివారణ ఎలా?

కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్లడం వల్ల మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. ఎండు తెగులు నివారణకు తెగులు ఆశించిన మొక్కల మొదళ్లు తడిచేలా.. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి.. ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి.