News March 20, 2024
‘UBER’కు రూ.20వేల ఫైన్!

బుక్ చేసే సమయంలో చూపిన ఛార్జీ కంటే మూడు రెట్లు ఎక్కువగా డబ్బులు వసూలు చేసినందుకు UBER కంపెనీకి కన్జూమర్ కోర్టు రూ.20వేల జరిమానా విధించింది. చండీగఢ్కు చెందిన ప్రశార్ 2021 ఆగస్టు 6న ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. 8.83కిలో మీటర్లకు రూ.359 చూపించగా.. గమ్యం చేరే సమయానికి రూ.1334కి చేరుకుంది. అతడి ఫిర్యాదును విచారించిన కోర్టు కస్టమర్ ఖాతాలో పదివేలు, లీగల్ ఎయిడ్ ఖాతాలో పదివేలు జమచేయాలని ఆదేశించింది.
Similar News
News October 25, 2025
పార్టీకి నష్టం జరగొద్దనే పోరాట విరమణ: ఆశన్న

కేంద్ర బలగాల దాడులతో పార్టీకి నష్టం జరగొద్దనే సాయుధ పోరాటాన్ని విరమించామని మావోయిస్టు ఆశన్న తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి BR దాదా నాయకత్వంలో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సమాచార లోపంతో కొంతమంది కామ్రేడ్లు దీన్ని తప్పుగా భావిస్తున్నారని వెల్లడించారు. ఇటీవల 200 మంది మావోలతో కలిసి ఆశన్న ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు. అంతకుముందు మల్లోజుల మహారాష్ట్రలో సరెండర్ అయ్యారు.
News October 25, 2025
విడుదలకు సిద్ధమైన ‘మాస్ జాతర’.. రన్టైమ్ ఇదే

రవితేజ-శ్రీలీల ‘మాస్ జాతర’ రన్టైమ్ లాక్ అయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంది. అలాగే సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాలను వెల్లడిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘మాస్, ఫన్ అండ్ యాక్షన్ అన్నీ ఒకదాంట్లోనే. ఎంటర్టైన్మెంట్ మాస్వేవ్ను థియేటర్లలో ఆస్వాదించండి’ అని పేర్కొన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ OCT 31న రిలీజ్ కానుంది.
News October 25, 2025
అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్లో ఆధార్ లింక్ చేయాలని డెడ్లైన్ విధించింది. ఆధార్తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.


