News March 31, 2025

200 సిక్సర్లు.. ధోనీ అరుదైన రికార్డు

image

CSK ప్లేయర్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పారు. 30 ఏళ్ల వయసు దాటాక ఐపీఎల్‌లో 200 సిక్సులు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. ప్రస్తుతం 43వ వడిలో ఉన్న మిస్టర్ కూల్ నిన్న RRతో మ్యాచ్‌లో తుషార్ వేసిన 19వ ఓవర్‌లో సిక్స్ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా క్రిస్‌గేల్(347) ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు. ఇక ధోనీ తర్వాత రోహిత్(113), అంబటి రాయుడు(109), దినేశ్ కార్తీక్(104) ఉన్నారు.

Similar News

News April 2, 2025

97 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం

image

ఫిబ్రవరిలో నిబంధనలు ఉల్లంఘించిన 97 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. వీటిలో 14 లక్షల ఖాతాలపై ఫిర్యాదు రాకముందే చర్యలు తీసుకుంది. తప్పుదోవ పట్టించే అకౌంట్లను ఏఐ సాంకేతికత ద్వారా గుర్తించింది. యూజర్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని వాట్సాప్ పేర్కొంది. స్పామ్ మెసేజ్‌లు పంపడం, నకిలీ అకౌంట్లు, థర్డ్ పార్టీ యాప్స్ వాడటం, తప్పుడు సమాచార వ్యాప్తి వంటి కారణాలతో అకౌంట్లను బ్యాన్ చేస్తోంది.

News April 2, 2025

పంజాబ్ కింగ్స్: దేశీయ ఆటగాళ్లే బలం

image

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు విజయాలు అందుకుంది. ఈ జట్టులో ఎక్కువ మంది స్వదేశీ ఆటగాళ్లే ఉండటం విశేషం. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌‌సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు. ఇందులో శ్రేయస్ ఒక్కడే జాతీయ జట్టు తరఫున ఆడారు. మిగతా అందరూ అన్‌క్యాప్డ్ ప్లేయర్లే. ఇక బ్యాటర్లలో స్టొయినిస్, మ్యాక్సీ మాత్రమే ఫారిన్ ప్లేయర్లు.

News April 2, 2025

వక్ఫ్ చట్ట సవరణతో వచ్చే మార్పులివే..

image

సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డులను ప్రక్షాళన చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇది చట్టరూపం దాల్చితే మహిళలు సహా ముస్లిమేతరులను సైతం సభ్యులుగా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కలెక్టర్ల వద్ద వక్ఫ్ ఆస్తులన్నీ రిజిస్టర్ చేయాలి. ఏదైనా వివాదం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిదే తుది నిర్ణయం. దేశంలో మొత్తం 30 బోర్డులున్నాయి. వీటి పరిధిలో 9.4L ఎకరాల భూములున్నాయి. రైల్వే, ఆర్మీ ఆస్తుల తర్వాత ఇవే అత్యధికం.

error: Content is protected !!