News November 19, 2024
2019 VS 2024: 7 రెట్లు ఎక్కువ డబ్బు సీజ్ చేసిన ECI

తాజా ఎన్నికల సీజన్లో రూ.1000 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్టు ECI తెలిపింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ కలుపుకొని రూ.858 కోట్లు స్వాధీనం చేసుకున్నామంది. 2019తో పోలిస్తే ఈ విలువ 7 రెట్లు ఎక్కువని తెలిపింది. మహారాష్ట్రలో రూ.660 కోట్లు, ఝార్ఖండ్లో రూ.198 కోట్లు, బై పోల్స్ జరిగే రాష్ట్రాల్లో రూ.223 కోట్లమేర సీజ్ చేశామని వెల్లడించింది. NOV 20న తుదిదశ పోలింగ్ ఉండటంతో నిఘా ఇంకా పెంచుతామని పేర్కొంది.
Similar News
News November 13, 2025
TG TET షెడ్యూల్ విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) షెడ్యూల్ విడుదలైంది. రేపు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.
News November 13, 2025
పచ్చిరొట్టగా పెసర/మినుముతో సాగుకు లాభం

ఒక ఎకరం పొలంలో 6-8 కిలోల పెసర/మినుము విత్తనాలు చల్లాలి. పూత దశకు వచ్చాక మొదళ్లు, కొమ్మలు, ఆకులను భూమిలో కలియదున్నాలి. దీని వల్ల 8 టన్నుల పచ్చిరొట్ట ఎరువు వస్తుంది. అలాగే 24KGల నత్రజని, 5KGల భాస్వరం, 6KGల పొటాష్, ఇతర పోషకాలు భూమికి అందుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువు భూమిలో మొక్కల వేర్ల ద్వారా నత్రజనిని ఎక్కువగా స్థిరీకరిస్తుంది. దీని వల్ల పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి పొందవచ్చు.
News November 13, 2025
బిహార్లో SIRపై ఒక్క అప్పీల్ కూడా రాలేదు: EC

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 67.13% పోలింగ్ నమోదైనట్లు EC అధికారికంగా ప్రకటించింది. 1951 నుంచి ఇదే అత్యధికమని తెలిపింది. 38 జిల్లాల్లో ఎక్కడా రీపోల్ కోసం అప్పీల్స్ రాలేదని తెలిపింది. 7,45,26,858 మంది ఓటర్లతో తుది జాబితా రిలీజ్ చేశామని, ఎక్కడా SIRపై అప్పీల్ చేయలేదని వెల్లడించింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుందని చెప్పింది. ఇందుకోసం 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.


