News October 4, 2025
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2,094 పోస్టులు

నార్త్ వెస్ట్రన్ రైల్వే RRC 2,094 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC,ST, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. వెబ్సైట్: https://rrcjaipur.in/
Similar News
News October 4, 2025
దేశం విడిచి వెళ్తే 2,500 డాలర్లు: ట్రంప్

వలసదారుల పిల్లలు(14 ఏళ్లు లేదా పైబడిన) US విడిచి వెళ్తే ఒకేసారి 2,500 డాలర్లు(దాదాపు రూ.2.5 లక్షలు) ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. స్వచ్ఛందంగా దేశాన్ని విడిచివెళ్లడాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఆ పిల్లలు సొంతం దేశం చేరినట్లుగా ఇమ్మిగ్రేషన్ జడ్జి ఆమోదిస్తేనే డబ్బులు చెల్లిస్తామన్నారు. కాగా ఇది క్రూరమైన నిర్ణయమని విమర్శలు వస్తున్నాయి.
News October 4, 2025
మీకు ఒక్కరే సంతానమా..

ఇంట్లో ఒక్క సంతానమే ఉంటే వారు గారాబంగా పెరుగుతారు. బొమ్మలు, వస్తువులను వేరెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. అయితే ఇలాంటి ప్రవర్తన భవిష్యత్తులో చిన్నారికి ప్రతికూలంగా మారొచ్చు. దీనికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం తోటి పిల్లలతో స్నేహం చేయడం, కలిసి ఆడుకోవడం, బొమ్మలను, ఫుడ్ను పంచుకోవడం వంటివి అలవాటు చేయాలి. దీనివల్ల క్రమంగా చిన్నారుల్లో మార్పు వచ్చి అందరిలోనూ కలిసిపోతారు.
<<-se>>#ChlidCare<<>>
News October 4, 2025
విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు గూడెం, బండ్ల

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న MLAలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పీకర్ ఛాంబర్లో విచారణకు హాజరయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలను పిటిషనర్ల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. వీరిద్దరు కాంగ్రెస్లో చేరారని, వీరిపై వేటు వేయాలంటూ మహిపాల్ రెడ్డిపై చింత ప్రభాకర్, బండ్లపై పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. SC ఆదేశాలతో సెప్టెంబర్ 29 నుంచి విచారణ ప్రారంభమైంది.