News October 4, 2025

నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2,094 పోస్టులు

image

నార్త్ వెస్ట్రన్ రైల్వే RRC 2,094 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC,ST, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. వెబ్‌సైట్: https://rrcjaipur.in/

Similar News

News April 5, 2026

విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదు: హైకోర్టు

image

AP: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీనిపై గతంలో దేవదాయ శాఖ, శృంగేరి శారదా పీఠం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్లిన వారు సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్నారని, వారు గర్భాలయాల్లోకి వెళ్లకూడదన్న నిబంధన అమలు కావడం లేదంటూ ఓ అర్చకుడు కోర్టులో పిటిషన్ వేశారు.

News April 5, 2026

ఒకే కథ.. 3 ప్రాజెక్టులు!

image

‘కుమారస్వామి’ కథతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా తెరకెక్కించాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ కథాంశంతోనే మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ఆయన కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. కాగా ‘కుమారస్వామి’పై తానూ ఓ స్క్రిప్ట్ రాసుకున్నట్లు కిశోర్ తిరుమల కూడా గతంలో వెల్లడించారు. మరి వీటిలో ఏది ముందుగా థియేటర్లలోకి వస్తుందో చూడాలి.

News April 5, 2026

రత్నమైనా, పద్యమైనా.. విలువ దేనికంటే?

image

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: శ్రేష్ఠమైన నీలి రంగు రత్నం ఒక్కటి ఉన్నా చాలు. దానికి ఎంతో విలువ ఉంటుంది. తళతళ మెరిసే రాళ్లు తట్టెడు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే రసవంతమైన, అర్థవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. వేల సంఖ్యలో అర్థం లేని పద్యాలతో మంచి జరగదు.<<-se>>#PADHYAM<<>>