News February 18, 2025

పరీక్ష లేకుండా 21,413 ఉద్యోగాలు

image

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. APలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేపడతారు. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. చివరి తేదీ: మార్చి 3. indiapostgdsonline.gov.in

Similar News

News March 23, 2025

IPL-2025: చెన్నై, ముంబై జట్లు ఇవే

image

చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో CSK టాస్ గెలిచి బౌలింగ్ చేయనుంది. ఇరు జట్లను పరిశీలిస్తే..
CSK: రుతురాజ్ గైక్వాడ్(C), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, దూబే, జడేజా, శామ్ కరన్, ధోనీ, అశ్విన్, నూర్ అహ్మద్, ఎల్లిస్, ఖలీల్ అహ్మద్
MI: రోహిత్, ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ (C), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, సత్యనారాయణ రాజు

News March 23, 2025

టాస్ గెలిచిన CSK

image

IPL-2025: చెన్నై వేదికగా ఇవాళ MI, CSK జట్లు తలపడనున్నాయి. ముందుగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.

News March 23, 2025

రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

image

TG: రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ APR నుంచి 6KGల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఈ నెల 30న హుజూర్‌నగర్‌లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామన్నారు.

error: Content is protected !!