News December 29, 2024
ఈ ఏడాది 2,34,158 కేసులు నమోదు: డీజీపీ
TG: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదయ్యాయని డీజీపీ జితేందర్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 9.87% కేసులు పెరిగాయన్నారు. ఈ ఏడాది 1,942 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయన్నారు. 2024 వార్షిక క్రైమ్ రిపోర్టును ఆయన వెల్లడించారు. రూ.142.50 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. ఒకటి, రెండు ఘటనలు మినహా శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2025
DANGER: రోజూ ఒకే సమయానికి నిద్ర పోవట్లేదా?
చాలామంది ఉద్యోగులు షిఫ్టుల వల్ల నిత్యం ఒకే సమయానికి నిద్రపోరు. దీన్నే ‘సోషల్ జెట్లాగ్’ అంటారు. ఒక వారంలో నిద్రపోయే సమయాల్లో 90 నిమిషాలు తేడా వస్తే శరీరంలో మైక్రోబయోటా జాతులు ఉత్పత్తి అవుతాయని సైంటిస్టులు గుర్తించారు. అలాంటివారికి ఎక్కువగా చిప్స్, షుగరీ ఫుడ్స్ తినాలనిపిస్తుందని తెలిపారు. ఫలితంగా సరైన ఆహారం తీసుకోలేకపోవడం, ఊబకాయం, కడుపులో మంట, స్ట్రోక్ ముప్పు తలెత్తవచ్చని సైంటిస్టులు తేల్చారు.
News January 20, 2025
ఇన్ఫోసిస్లో జీతాలే పెరగవు.. మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్
ఇన్ఫోసిస్లో శాలరీ హైక్ చాలా తక్కువని సంస్థ మాజీ ఉద్యోగి తెలిపారు. 9 ఏళ్లు పనిచేసి 2017లో రిజైన్ చేసేనాటికి తన జీతం రూ.35 వేలు మాత్రమేనన్నారు. వేరే టెక్ కంపెనీలో చేరగా 4 ఏళ్లలో నెల వేతనం రూ.1.75 లక్షలకు చేరిందని చెప్పుకొచ్చారు. క్యాబ్, పార్కింగ్ వంటి సదుపాయాలు కూడా ఇన్ఫోసిస్లో ఉండేవి కావన్నారు. ప్రస్తుత కంపెనీలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని రెడిట్లో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
News January 19, 2025
రేషన్ కార్డులపై కీలక ప్రకటన
TG: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ పారదర్శకంగా రేషన్ కార్డులు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం ఇంకా ఎలాంటి జాబితా రెడీ కాలేదని తెలిపారు. ఖమ్మం(D) బనిగండ్లపాడులో మాట్లాడుతూ ఏ లిస్టు అయినా గ్రామ సభల్లోనే తయారవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులూ నమ్మొద్దన్నారు. అలాగే వ్యవసాయ యోగ్యమైన భూములకు షరతులు లేకుండా ఎకరానికి రూ.12వేలు ఇస్తామని పునరుద్ఘాటించారు.