News April 30, 2024
అసెంబ్లీకి 2,387, లోక్సభకు 454 మంది పోటీ

AP: నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్ర ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను EC అధికారికంగా విడుదల చేసింది. 25 లోక్సభ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ చేస్తున్నట్లు తెలిపింది. తిరుపతి ఎమ్మెల్యే సీటుకు అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీలో ఉన్నారు. విశాఖ ఎంపీ సీటుకు అత్యధికంగా 33 మంది, రాజమండ్రి పార్లమెంట్కు అత్యల్పంగా 12 మంది బరిలో నిలిచారు.
Similar News
News January 30, 2026
నవగ్రహాలు – నవరత్నాలు: ఏ గ్రహానికి ఏ రత్నం?

ఆదిత్యుడు – కెంపు
చంద్రుడు – ముత్యం
అంగారకుడు – ఎర్రని పగడం
బుధుడు – పచ్చ
గురు – పుష్య రాగం
శుక్రుడు – వజ్రం
శని – నీలం
రాహువు – గోమేధుకం
కేతువు – వైడూర్యం
News January 30, 2026
రాజీకి ఏ విధానం అనుసరించారు: హైకోర్టు

AP: పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని TTD EOను HC ఆదేశించింది. రాజీకి అథారిటీ ఎవరు? ఏ విధానం అనుసరించారు? టీటీడీ నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని తెలిపింది. సింగిల్ జడ్జి ఆదేశాలపై వచ్చిన అప్పీల్తో పాటు సుమోటో పిటిషన్ను కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. కేసును Feb 5కు వాయిదా వేసింది.
News January 30, 2026
పీటీ ఉష భర్త కన్నుమూత

భారత దిగ్గజ అథ్లెట్, రాజ్యసభ MP PT ఉష భర్త శ్రీనివాసన్(64) కన్నుమూశారు. కేరళ థిక్కోడి పెరుమాళ్పురంలోని నివాసంలో ఈ తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ తుదిశ్వాస విడిచారు. ఘటన జరిగినప్పుడు ఉష ఇంట్లో లేరు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్నారు. విషయం తెలియగానే ఆమె బయల్దేరారు. శ్రీనివాసన్ మృతిపట్ల PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


