News May 21, 2024

24 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

image

AP: ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 1.61 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరి కోసం 684 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 21, 2026

ట్రంప్ దెబ్బ.. ప్రపంచ స్టాక్ మార్కెట్లూ పతనం

image

US అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు గ్లోబల్ స్టాక్ మార్కెట్లూ భారీగా పతనమవుతున్నాయి. USకు చెందిన Dow 870(1.76%) పాయింట్లు, S&P 143(2%), Nasdaq 561(2.39%) పాయింట్లు నష్టపోయాయి. దీంతో నేడు నిక్కీ 283(0.53%-జపాన్‌), DAX 255(1%-జర్మనీ), తైవాన్ మార్కెట్లు 510(1.62%) పాయింట్లు కోల్పోయాయి. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కాలుదువ్వడం, టారిఫ్స్, ట్రేడ్ వార్ భయాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి.

News January 21, 2026

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: కవిత

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు కావాలంటే ఆ పార్టీకి తెలంగాణ జాగృతి సపోర్ట్ చేస్తుందని తెలిపారు. కాగా కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రక్రియకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అటు ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

News January 21, 2026

సునీతా విలియమ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్‌ పాండ్యా, స్లొవీన్‌ అమెరికన్‌ ఉర్సులైన్‌ బోనీలకు 1965 సెప్టెంబర్‌ 19న ఒహాయోలో సునీత జన్మించారు. 1998లో నాసాలో చేరిన ఆమె మొత్తం మూడుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. మొత్తంగా 608 రోజులు అంతరిక్షంలోనే ఉన్నారు. తొమ్మిదిసార్లు స్పేస్‌వాక్‌ చేశారు.