News May 21, 2024

24 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

image

AP: ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 1.61 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరి కోసం 684 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News February 2, 2026

VASTHU: ఇంటి ప్రాంగణంలో ఈ మొక్కలు వద్దు!

image

ఇంటి ప్రాంగణంలో కొన్ని రకాల చెట్లు ఉండటం అశుభమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పాలు కారే చెట్లు ఉండొద్దు. ఇవి ధన నష్టానికి కారణమవుతాయి. ముళ్లున్న మొక్కలు శత్రుత్వానికి దారితీస్తాయని అంటారు. ఇంటికి అతి సమీపంలో నీడ పడేలా ఉండే పెద్ద చెట్లు, ఊడలు దిగే మర్రి, రావి చెట్లు పునాదులకు, వంశాభివృద్ధికి ఆటంకంగా మారుతాయి. ఎండిపోయిన, కుళ్లిపోయిన మొక్కలను వెంటనే తొలగించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 2, 2026

బ్రాండ్లు వేరైనా.. యజమాని ఒక్కరే

image

మార్కెట్‌లో వేర్వేరు బ్రాండ్ల మధ్య పోటీ ఉందని భావిస్తాం. కానీ కొన్నిసార్లు మన డబ్బు ఒకే సంస్థ జేబులోకి వెళ్తుంది. దీన్నే మల్టీ బ్రాండింగ్ స్ట్రాటజీ అంటారు. ఉదాహరణకు అప్సర, నటరాజ్.. రెండు పెన్సిల్స్ ఒకే సంస్థవి. లక్స్, లైఫ్‌బాయ్ సబ్బులు కూడా హిందుస్థాన్ యూనిలీవర్‌ సంస్థకు చెందినవి. ఆడి, స్కోడా కార్లు వోక్స్‌వ్యాగన్ గ్రూపువి. ప్రతి రకమైన కస్టమర్‌ను ఆకట్టుకోవడానికి కంపెనీలు ఈ స్ట్రాటజీని వాడుతాయి.

News February 2, 2026

900 మంది టీచర్ల కుటుంబాలకు జరగని న్యాయం!

image

AP: విధుల్లో ఉండగా 2019-2025 మధ్య అకాల మరణం పొందిన 900 మంది టీచర్ల కుటుంబాల్లో ఇంకా అంధకారం తొలగలేదు. చనిపోయిన వారి పిల్లల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. కానీ ఆరేళ్లుగా అధికారులను కలుస్తున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ‘6 నెలల కిందట Dy.CM పవన్‌ను కలవగా ఆయన CMOకు లెటర్ పంపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.