News March 17, 2024

జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు: ఎస్పీ చందనా దీప్తి

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు చేస్తామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ లక్ష్యం అన్నారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక ప్రాంతాలు, 439 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని తెలిపారు.
అక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అవసరమైన ప్రతీ చోటా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News December 8, 2025

కట్టంగూరు: బాండ్‌ పేపర్‌పై హామీ.. నెరవేర్చకుంటే రిజైన్‌..!

image

తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సర్పంచ్‌ పదవికి రాజీనామా చేస్తానని అభ్యర్థిని శ్రీపాద పుష్పలత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రూ.100 బాండ్‌ పేపర్‌పై ఆమె హామీలను లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. తనను గెలిపిస్తే గ్రామంలో మరో అండర్‌పాస్‌ నిర్మాణం కోసం పోరాడతానని, రెండేళ్లలో అండర్‌పాస్‌ సాధించని పక్షంలో రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ప్రకటించారు.

News December 7, 2025

మిర్యాలగూడ డివిజన్ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మిర్యాలగూడ డివిజన్‌లో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ను ఆదివారం జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి పర్యవేక్షణలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఛాంబర్‌లో నిర్వహించారు. డివిజన్‌లోని పది మండలాల్లో 2,418 పోలింగ్ కేంద్రాలకు సరిగ్గా 2,418 బృందాలను కేటాయించారు.

News December 7, 2025

NLG: స్థానిక పోరు.. కూలీలు లేరు..!

image

స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం నల్గొండ జిల్లాలో జోరందుకుంది. అభ్యర్థులు, వారి బంధువులు, సమర్థకులు ప్రచారంలో నిమగ్నం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రమైంది. ఫలితంగా, ప్రస్తుతం యాసంగి సాగు పనులు చేపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక పోవడంతో పొలాల్లో పనులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.