News April 6, 2024
25 మంది BRS MLAలు కాంగ్రెస్లో చేరబోతున్నారు: మంత్రి
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ పొగరు వల్లే 104 ఎమ్మెల్యేల ఉన్న BRS.. 39కి వచ్చింది. ఇందులో 25 మంది కాంగ్రెస్లో చేరబోతున్నారు. కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ దుస్థితికి కారణం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ వల్లే కరవు వచ్చిందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాలు ఏపీకి అధికంగా తరలించారని ఉత్తమ్ ఆరోపించారు.
Similar News
News October 9, 2024
జానీ మాస్టర్ అవార్డు రద్దు మంచిదే: కర్ణాటక మంత్రి
జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు చేసి కేంద్రం మంచి పనిచేసిందని కర్ణాటక మంత్రి దినేశ్ గుండూరావు సమర్థించారు. రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గౌరవించడం సరికాదన్నారు. ఇదే తరహాలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యడియూరప్పపై కూడా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యడియూరప్ప విషయంలో కేంద్రం ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన ప్రశ్నించారు.
News October 9, 2024
ఇవి పైసలు కావు.. జ్ఞాపకాలు!
పై ఫొటోలో కనిపిస్తున్నవి 5 పైసల నుంచి 20 పైసల వరకూ నాణేలు. ఇప్పుడంటే చలామణీలో లేవు గానీ 90వ దశకంలో పుట్టినవారికి ఇవి మధుర జ్ఞాపకాలు. వీటిని చూస్తే చిన్నతనంలో కొనుక్కున్న పిప్పరమెంట్, పప్పుండ, తాటి-మామిడి తాండ్ర, రేగి ఒడియం, నిమ్మ తొనల చాక్లెట్, బఠాణీలు, గోళీలలాంటివన్నీ గుర్తుకొస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీ చిన్నతనంలో ఈ పైసలుండేవా..? మీ జ్ఞాపకాల్ని కామెంట్స్లో పంచుకోండి.
News October 9, 2024
ఒసామా బిన్ లాడెన్ కొడుకుపై ఫ్రాన్స్లో నిషేధం
ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ను ఫ్రాన్స్ బహిష్కరించింది. ఓ బ్రిటిష్ పౌరురాల్ని పెళ్లాడి నార్మండీలో సెటిలై చాలాకాలంగా పెయింటింగ్స్ వేస్తూ కాలం గడిపిన ఒమర్, గత ఏడాది సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతునిస్తూ కామెంట్స్ పెట్టారు. దీంతో అతడిని దేశం నుంచి బయటికి పంపించిన ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి రాకుండా నిషేధం విధించింది. ఒమర్ ప్రస్తుతం ఖతర్లో ఉన్నట్లు సమాచారం.