News April 6, 2024

25 మంది BRS MLAలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు: మంత్రి

image

TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ పొగరు వల్లే 104 ఎమ్మెల్యేల ఉన్న BRS.. 39కి వచ్చింది. ఇందులో 25 మంది కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ దుస్థితికి కారణం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ వల్లే కరవు వచ్చిందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాలు ఏపీకి అధికంగా తరలించారని ఉత్తమ్ ఆరోపించారు.

Similar News

News April 19, 2026

భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక మలుపు ‘ఆర్యభట్ట’

image

భారత తొలి కృత్రిమ ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను 1975లో ఇదే రోజు రష్యాలోని కాపుస్తిన్ యార్ ప్రయోగకేంద్రం నుంచి ఇస్రో చేపట్టింది. X-RAY ఖగోళ శాస్త్రం, ఏరోనమీ, సోలార్ ఫిజిక్స్‌పై ప్రయోగాలు చేసే ఉద్దేశంతో ప్రయోగించింది. 5 రోజులపాటు విజయవంతంగా పనిచేసిన ఈ శాటిలైట్ దాదాపు 17yrs తర్వాత భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఆనాడు వేసిన ఈ చిన్న అడుగే నేడు స్పేస్ రంగంలో భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపింది.

News April 19, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ఏరియాను బట్టి రూ.270 నుంచి రూ.280 వరకు అమ్ముతున్నారు. వరంగల్‌లో రూ.270, కామారెడ్డి రూ.270, ఖమ్మంలో రూ.280కి విక్రయిస్తున్నారు. ఏపీలోని విజయవాడలో రూ.230, పల్నాడులో రూ.250-రూ.280, కర్నూలులో రూ.260, నంద్యాలలో రూ.280గా ఉంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News April 19, 2026

MMTS రైళ్లలో ఫ్రీ జర్నీ.. జూన్ 2 నుంచి అమలు?

image

TG: HYDలో ట్రాఫిక్, పొల్యూషన్‌కు చెక్ పెట్టేందుకు MMTS రైళ్లలో ప్రయాణికులందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని JUNE 2 నుంచి ఏడాదిపాటు అమలు చేయాలని భావిస్తోంది. ఫలితాన్ని బట్టి ఆ తర్వాత కొనసాగించే ఛాన్సుంది. ఈ మేరకు ద.మ.రైల్వేకు లేఖ రాసింది. MMTS రైళ్ల ద్వారా రైల్వేకి ఏడాదికి సుమారు ₹10Cr ఆదాయం వస్తుండగా, దానిని తామే చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినట్లు సమాచారం.