News September 25, 2024

నేడు అకౌంట్లలోకి రూ.25 వేలు

image

AP: వరద బాధితుల అకౌంట్లలో నేడు ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి రూ.597 కోట్ల మేర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. NTR జిల్లా కలెక్టరేట్‌లో బాధితులకు CM చంద్రబాబు పరిహారం అందించనున్నారు. ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ.10వేలు, దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి GOVT ఆర్థిక సాయం ఇవ్వనుంది.

Similar News

News September 25, 2024

విశాఖ పర్యటనకు నారా లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ, రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులను లోకేశ్ కలవనున్నారు.

News September 25, 2024

BREAKING: మాజీ MLA మృతి

image

AP: మాగుంట కుటుంబంలో విషాదం నెలకొంది. మాజీ MP, MLA మాగుంట పార్వతమ్మ(77) అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దివంగత MP సుబ్బరామిరెడ్డికి సతీమణి అయిన ఆమె.. 1996లో INC తరఫున ఒంగోలు MP, 2004లో కావలి MLAగా గెలిచారు. ప్రస్తుత MP మాగుంట శ్రీనివాసులురెడ్డికి పార్వతమ్మ వదిన. ఆమె మృతి తమ కుటుంబంలో విషాదం నింపిందని, రేపు నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహిస్తామని MP వెల్లడించారు.

News September 25, 2024

ఈ ఆరుగురు క్రికెటర్లు 8 వరల్డ్ కప్స్ ఆడారు!

image

ఇప్పటి వరకు మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలు 8సార్లు జరగగా ఆరుగురు క్రికెటర్లు వాటన్నింటిలోనూ ఆడారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, న్యూజిలాండ్‌కు చెందిన బ్యాటర్ సుజీ బేట్స్, ఆల్‌రౌండర్ సోఫీ డివైన్, శ్రీలంక కెప్టెన్ చామరి ఆటపట్టు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ స్టెఫానీ టేలర్ ఆ జాబితాలో ఉన్నారు. కాగా వచ్చే నెల 3 నుంచి టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్ UAEలో మొదలుకానుంది.