News September 16, 2024

గణేశ్ లడ్డూకు వేలంపాటలో రూ.26లక్షలు

image

AP: విజయవాడ సమీపంలోని నున్న గ్రామంలో శ్రీసాయి బాలాజీ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో గణేశ్ లడ్డూకు రికార్డు ధర పలికింది. సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నక్కా రామ్, బాలాజీ వేలంపాటలో లడ్డూను రూ.26 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ డబ్బును అపార్ట్‌మెంట్స్ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని మాదాపూర్ మైహోమ్ భుజాలో గణేశ్ లడ్డూ <<14109980>>రూ.29 లక్షలు<<>> పలికిన విషయం తెలిసిందే.

Similar News

News November 19, 2025

మావోయిస్టుల కథ ముగిసినట్టేనా?

image

‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఒక్కొక్కరిగా హతం అవుతున్నారు. 5 నెలల్లో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. వారిలో సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అంజు దాదా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న తదితర కీలక సభ్యులు లొంగిపోయారు. పలువురు ప.బెంగాల్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. తాజాగా హిడ్మా మృతితో కేంద్ర నాయకత్వం మరింత బలహీనపడింది.

News November 19, 2025

ఉమ్మడి KNRలోని ఫేమస్ ‘అయ్యప్ప టెంపుల్స్’..!

image

మెట్‌పల్లి ధర్మశాస్తాలయం, జమ్మికుంట, కేశవపట్నం, గొల్లపల్లి, హుజూరాబాద్, కోరుట్ల <<18317644>>అయ్యప్పగుట్ట<<>>, మల్యాల, రాయికల్, ఇల్లంతకుంట, ధర్మారం, వేములవాడ, ధర్మపురి, ముస్తాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, మంథని, చొప్పదండి, సుల్తానాబాద్, ఎల్లారెడ్డిపేట, కాల్వశ్రీరాంపూర్, గోదావరిఖని, హుస్నాబాద్, KNRలోని భగత్‌‌‌నగర్, జ్యోతినగర్, మధురానగర్, మహాత్మానగర్, కశ్మీర్‌‌గడ్డ, గోదాంగడ్డ, గంగాధర, తీగలగుట్టపల్లి, తిమ్మాపూర్

News November 19, 2025

ఆపరేషన్ కగార్.. వరంగల్ అన్నల రక్త చరిత్ర..!

image

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ దాడుల్లో ఉమ్మడి WGL జిల్లాకు చెందిన పలువురు కీలక మావోయిస్టు నేతలు ఈ ఏడాదిలో హతమయ్యారు. సెప్టెంబర్ 11న ఛత్తీస్‌గఢ్ గరియాబాద్ అడవుల్లో మడికొండకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ మృతి చెందగా, జూన్ 18న ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఎన్‌కౌంటర్లో హతమయ్యాడు. అలాగే రేణుక, సారయ్య, రాకేశ్ కూడా బీజాపూర్, అబూజ్‌మడ్ అడవుల్లో మృతి చెందారు.