News August 6, 2024

హసీనా అసిస్టెంట్‌ పేరిట రూ.284 కోట్లు?

image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అసిస్టెంట్ జహంగీర్ ఆలమ్ పేరిట రూ.284 కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన యూఎస్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. హసీనా ఆస్తుల విలువ రూ.3.14 కోట్లు కాగా, ఆమె అసిస్టెంట్ ఆస్తుల విలువ రూ.284 కోట్లు ఉండటం బంగ్లాలో చర్చనీయాంశంగా మారింది. కాగా తనకు ఆరెకరాల భూమి ఉందని, అందులో పండే పంటల ద్వారా ఆదాయం వస్తుందని హసీనా గత ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Similar News

News December 20, 2025

గోదావరి పుష్కరాలకు రూ.3వేల కోట్లు?

image

AP: 2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. ఏలూరు, కాకినాడ, తూ.గో, ప.గో, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 500+ ఘాట్లు సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈసారి పుష్కరాల నిర్వహణ ఖర్చు ₹3,000Cr అవుతుందని అంచనా. ఇందులో కేంద్రం నుంచి మెజారిటీ వాటా తెప్పించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2015లో 4.50Cr మంది పుష్కర స్నానాలు ఆచరించారు. ఈసారి ఈ సంఖ్య 10Cr+ ఉంటుందని అంచనా.

News December 20, 2025

బంగ్లాను షేక్ చేస్తా.. గర్ల్‌ఫ్రెండ్‌తో హాదీ మర్డర్ నిందితుడు

image

ఉస్మాన్ హాదీ <<18610392>>హత్యతో<<>> బంగ్లా భగ్గుమంటోంది. దీంతో పోలీసులు మర్డర్ నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఫైజల్ అనే యువకుడిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. హాదీ హత్యకు ముందు అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ‘బంగ్లాను షేక్ చేస్తా’ అని చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత కొన్ని గంటలకే మరో ఇద్దరితో కలిసి అతడిపై కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ హాదీ ఒక చెవి నుంచి దూరి మరో చెవిలో నుంచి బయటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

News December 20, 2025

అనకాపల్లికి సీఎం చంద్రబాబు

image

AP: CM చంద్రబాబు ఇవాళ అనకాపల్లి(D) తాళ్లపాలెంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారు. బంగారయ్యపేటలో సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. తాళ్లపాలెంలో ప్రజావేదిక సభ, ఉగ్గినపాలెంలో TDP నేతలతో భేటీ, అనకాపల్లిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అటు నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు Dy.CM పవన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు.