News December 31, 2024
4 మ్యాచుల్లో 3 సెంచరీలు.. అన్నింట్లో నాటౌట్
విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన అతను 3 సెంచరీల సాయంతో 430 రన్స్ చేశారు. అన్నిట్లోనూ నాటౌట్గానే ఉండటం విశేషం. ప్రస్తుతం టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నారు. కరుణ్ J&Kపై 112*, ఛత్తీస్గఢ్పై 44*, చండీగఢ్పై 163*, తమిళనాడుపై 111* పరుగులు బాదారు. ఇతను భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 23, 2025
టీడీపీలో CBN తర్వాత స్థానం లోకేశ్దే: అచ్చెన్నాయుడు
AP: ఎవ్వరు ఏమనుకున్నా టీడీపీలో చంద్రబాబు తర్వాతి స్థానం లోకేశ్దేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు. కూటమికి 164 సీట్లు రావడంలో లోకేశ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే అంశం ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదని చెప్పారు. పదవులైనా, నిర్ణయాలైనా కూటమి ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు.
News January 23, 2025
శ్రీలంకపై భారత్ విజయం
అండర్-19 మహిళల వరల్డ్ కప్లో భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష(49) రాణించడంతో 118 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 58 పరుగులే చేసింది. భారత బౌలర్లలో షబ్నాం, జోషిత, పరుణిక చెరో రెండు, ఆయూషి, వైష్ణవి తలో వికెట్ తీశారు.
News January 23, 2025
₹2లక్షల కోట్లు.. కేంద్రానికి త్వరలో RBI బొనాంజా!
కేంద్ర ప్రభుత్వానికి RBI బంపర్ బొనాంజా ఇవ్వనుంది. అతి త్వరలోనే రూ.1.5-2 లక్షల కోట్ల వరకు బదిలీ చేయనుందని తెలిసింది. డాలర్ల విక్రయం, పెట్టుబడులు, కరెన్సీ ప్రింటింగ్ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయాన్ని సంస్థ ఏటా కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. క్రితంసారి రూ.2.10లక్షల కోట్లు ఇచ్చింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఇవ్వొచ్చని సమాచారం. డాలర్ల విక్రయంతో RBIకి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు అంచనా.