News December 4, 2024
3 లక్షల ఏళ్ల క్రితం నాటి మానవ పుర్రె

3లక్షల ఏళ్లకంటే పురాతనమైన మానవ అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా హవాయి విశ్వవిద్యాలయం కాలేజీ ఆఫ్ సోషల్ సైన్సెస్లోని మనోవా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జె. బే వీటిని కనిపెట్టారు. ఆయన 30 ఏళ్లుగా ఆసియా అంతటా మానవ పూర్వీకులపై అధ్యయనం చేశారు. ఫలితంగా హోమో జులుయెన్సిస్ అనే పురాతన మానవ జాతిని గుర్తించారు. పెద్ద పుర్రె ఆధారంగా వీరి తలలు పెద్దగా ఉంటాయని తెలిపారు.
Similar News
News February 15, 2026
జగిత్యాల ఎపిసోడ్కు ఫుల్స్టాప్!

TG: జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ వీడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. MLA సంజయ్, జీవన్రెడ్డితో మంత్రి అడ్లూరి, AICC సెక్రటరీ సవాంగ్ మాట్లాడారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. 23 మంది అభ్యర్థులతో MLA సంజయ్ క్యాంప్ ఏర్పాటు చేయగా, 14 మందితో జీవన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.
News February 15, 2026
మార్కులు మీ జీవితాన్ని డిసైడ్ చేయలేవు: వినీత్

జీవితంలో చదువుకు, సక్సెస్కు సంబంధం లేదని HCL మాజీ సీఈవో వినీత్ నాయర్ స్పష్టం చేశారు. ఒకవేళ బోర్డు పరీక్షలు, మార్కులే జీవితాన్ని డిసైడ్ చేస్తే 50 శాతం మంది సీఈవోలు నిరుద్యోగులుగా ఉంటారన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలని, మార్కుల గురించి ఆందోళన చెందవద్దని సూచించారు. పరీక్షల ఒత్తిడిలో ఉన్న స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులకు ఈ కామెంట్లు ప్రేరణగా నిలుస్తాయని నెటిజన్లు కొనియాడుతున్నారు.
News February 15, 2026
వాయువ్య మూలలో వాస్తుదోషాలు ఉంటే?

వాయువ్య మూల దోషపూరితంగా ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. అలాంటి స్థలంలో ఉండేవారు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు, ఫలితం లభించదని అంటున్నారు. ‘చేతికి అందాల్సిన అదృష్టం చేజారిపోతుంది. పిల్లల భవిష్యత్తు, ఇంటి పెద్దల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవసరానికి ఎవరూ ఆదుకోరు. కోర్టు కేసులు, శత్రుబాధలు పెరిగే ఛాన్సుంది’ అంటున్నారు.<<-se>>#Vasthu<<>>


