News April 15, 2025
APR 17న IPLలో 300 స్కోర్.. స్టెయిన్ ప్రిడిక్షన్ వైరల్

వాంఖడే వేదికగా ఎల్లుండి SRH-MI మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ మార్చి 23 చేసిన ఓ ప్రిడిక్షన్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. ‘ఏప్రిల్ 17న జరిగే మ్యాచ్లో ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి 300 స్కోర్ను చూడబోతున్నాం. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అది చూడటానికి నేను కూడా అక్కడ ఉండొచ్చు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో స్టెయిన్ అంచనా నిజమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News April 22, 2025
అందుకే జగన్ కడుపు మండుతోంది: అనగాని

AP: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని ప్రగతి, సంక్షేమం సాగుతోందని.. అందుకే మాజీ CM జగన్ కడుపు మండుతోందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఎద్దేవా చేశారు. అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్ను అలవాటుగా మార్చుకున్న ఆయన తన బురదను ఎదుటివారికి రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సిగ్గులేకుండా ఒక ఆడపిల్లను వేధించిన అధికారులను వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
News April 22, 2025
అల్లు అర్జున్పై పోలీసులకు ఫిర్యాదు

TG: కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని AISF తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. JEE మెయిన్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
News April 22, 2025
హిరోషిమాలో అణుబాంబు మృతులకు CM రేవంత్ నివాళులు

తెలంగాణ CM రేవంత్ జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఇవాళ హిరోషిమా పీస్ మెమోరియల్ పార్కును సందర్శించి అణుబాంబు మృతులకు నివాళులు అర్పించారు. అలాగే, దాడి జరిగిన ప్రాంతంలో శాంతికి చిహ్నంగా ఏర్పాటు చేసిన డోమ్ను సైతం సందర్శించారు. CMతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, జపాన్ ప్రతినిధులు ఉన్నారు. 1945లో 2వ ప్రపంచ యుద్ధం వేళ జపాన్పై US అణుబాంబుతో దాడి చేసిన విషయం తెలిసిందే.