News April 5, 2025

రాష్ట్రంలో రూ.33,800 జీతంతో 390 ఉద్యోగాలు

image

TG: 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(AE) పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కోసం వీరిని నియమించనుంది. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. నెలకు రూ.33,800 వేతనం ఉంటుంది. ఈనెల 11లోగా <>ఆన్‌లైన్‌లో దరఖాస్తు<<>> చేసుకోవాలి. సివిల్ ఇంజినీరింగ్ చేసి, 44yrsలోపు వారు అర్హులు.

Similar News

News April 17, 2025

ALERT: కాసేపట్లో భారీ వర్షం

image

తెలంగాణలోని కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాత్రి 7 గంటల లోపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అటు మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వాన పడుతుందని ఇప్పటికే అంచనా వేసింది. ప్రజలు ఎత్తైన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. కాగా ఆదిలాబాద్‌ జిల్లాలో సాయంత్రం వడగళ్ల వాన కురిసింది.

News April 17, 2025

గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

image

TG: గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకూ గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది.

News April 17, 2025

మంత్రి వివాదాస్పద కామెంట్స్.. FIR ఫైల్ చేయాలని కోర్టు ఆదేశం

image

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన TN మంత్రి కె.పొన్ముడిపై ఈనెల 23లోపు FIR నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. లేదంటే తామే ఈ కేసును సమోటోగా స్వీకరిస్తామని స్పష్టం చేసింది. ఓ సెక్స్ వర్కర్ తమ వద్దకు వచ్చిన వారిని శైవులా, వైష్ణవులా అని అడిగిందంటూ ఆయన అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో పొన్ముడిని డీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించింది.

error: Content is protected !!