News March 5, 2025
400 ఎకరాలు.. రూ.30వేల కోట్లు

TG: HYD కంచి గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దాదాపు రూ.30వేల కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు లేఅవుట్ల అభివృద్ధికి కన్సల్టెంట్ల నుంచి TGIIC ప్రతిపాదనలు కోరింది. ఎల్లుండి ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చింది. వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో 0.003 శాతం సదరు సంస్థకు వాటాగా ఇవ్వనుంది.
Similar News
News December 4, 2025
స్క్రబ్ టైఫస్.. ఫిబ్రవరి వరకు అప్రమత్తంగా ఉండండి: వైద్యులు

AP: ‘<<18454752>>స్క్రబ్ టైఫస్<<>>’ కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విజయనగరం, పల్నాడు జిల్లాల్లో వ్యాధి లక్షణాలతో ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 736 కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అనధికారికంగా మరిన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీటకాల తాకిడి ఆగస్టు-ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News December 4, 2025
పంట నుంచి పత్తి తీసేటప్పుడు ఈ తప్పులు వద్దు

కొన్నిసార్లు కొన్ని పత్తి కాయలు పగిలి, మరికొన్ని పగలకుండా ఉంటాయి. అప్పుడు వాటిని కోసేందుకు రైతులు 2,3 రోజులు ఆగుతారు. అయితే అకాల వర్షాలు, మంచు వల్ల అప్పటికే పగిలిన పత్తి కూడా రంగు మారి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. అందుకే పగిలిన కాయల నుంచి పత్తిని వెంటనే తీసేయాలి. పూర్తిగా పగలని కాయల నుంచి పత్తిని తీస్తే అది ముడిపత్తిలాగా ఉండి, నాణ్యమైన పత్తితో కలిపి మార్కెట్ చేసినపుడు ధర కోల్పోయే ప్రమాదం ఉంది.
News December 4, 2025
స్క్రబ్ టైఫస్.. వీరిపై ప్రభావం ఎక్కువ

AP: స్క్రబ్ టైఫస్ పురుగు చెట్లు, వ్యవసాయ భూములు పక్కనే నివసించే వారిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ పురుగు రాత్రి వేళల్లో మనుషులను కుడుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. తడి నేలలు, పొలం పనులకు వెళ్లేవారు రబ్బరు బూట్లు ధరించాలని, పిల్లలకు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేయాలని చెబుతున్నారు.


