News March 5, 2025

400 ఎకరాలు.. రూ.30వేల కోట్లు

image

TG: HYD కంచి గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా దాదాపు రూ.30వేల కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు లేఅవుట్ల అభివృద్ధికి కన్సల్టెంట్ల నుంచి TGIIC ప్రతిపాదనలు కోరింది. ఎల్లుండి ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 15 వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చింది. వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో 0.003 శాతం సదరు సంస్థకు వాటాగా ఇవ్వనుంది.

Similar News

News March 26, 2025

‘లిప్ లాక్’ కోసం బ్రష్ చేసుకోమన్నా: నటి

image

మలయాళ సినిమా ‘రైఫిల్ క్లబ్’ షూటింగ్ సమయంలో తన అనుభవాలను నటి సురభి లక్ష్మి పంచుకున్నారు. ఈ సినిమాలో కీలకమైన ముద్దు సన్నివేశంలో నటించే ముందు సహా నటుడు సజీవ్ కుమార్‌ను బ్రష్ చేసుకొని రమ్మన్నానని తెలిపారు. ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండటమే దానికి కారణమన్నారు. తానూ యాలకులు తిన్నట్లు పేర్కొన్నారు. ఈ సన్నివేశాన్ని సాధారణ సీన్ లాగే చిత్రీకరించాలని కోరినట్లు చెప్పారు. రొమాంటిక్ సీన్స్ నటనలో భాగమేనన్నారు.

News March 26, 2025

24 గంటల్లో 62 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఉద్ధృతం చేసింది. గత 24 గంటల్లో 62 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా అధికారులు ప్రకటించారు. వీరిలో పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. దక్షిణ గాజాలోని, ఖాన్ యూనిస్‌లో పునరావాస కేంద్రాలపై జరిగిన దాడుల్లో ఐదుగురు శరణార్థులు చనిపోయారని పేర్కొన్నారు. కాగా కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజానికి హమాస్ విజ్ఞప్తి చేసింది.

News March 26, 2025

మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నా: నటాషా

image

హార్దిక్ పాండ్యతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ప్రేమ గురించి ఆలోచిస్తున్నట్లు నటాషా తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు నచ్చిన భాగస్వామి దొరకడం ఖాయమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేమ మాత్రమే కాదు పరస్పరం గౌరవించుకునే అనుబంధాలను తాను ఇష్టపడతానని పేర్కొన్నారు. మళ్లీ మోడలింగ్, నటనను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!