News December 9, 2024

యుద్ధంలో 43వేల మంది సైనికులు మృతి: జెలెన్‌స్కీ

image

రష్యాతో యుద్ధంలో 43వేల మంది సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. దాదాపు మూడేళ్లుగా చేస్తున్న యుద్ధంలో మరో 3.70లక్షల మంది గాయపడ్డారన్నారు. రష్యా 1.98లక్షల మంది సైన్యాన్ని కోల్పోయిందని చెప్పారు. అటు, ఇరుదేశాలు కాల్పుల విరమణ అమలు చేయాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, జెలెన్‌స్కీలతో నిన్న భేటీ అయిన ఆయన ఈ యుద్ధంలో ఇరుదేశాలు నష్టపోయాయన్నారు.

Similar News

News January 14, 2025

లాస్ ఏంజెలిస్: మళ్లీ మంటలు.. హెచ్చరికలు

image

లాస్ ఏంజెలిస్ (అమెరికా)కు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. లాస్ ఏంజెలిస్ తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది పక్కన కొత్తగా మంటలు ప్రారంభమయ్యాయని, భీకర గాలులతో ఇవి వేగంగా విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. జురుపా అవెన్యూ, క్రెస్ట్ అవెన్యూ, బురెన్ ప్రజలు తక్షణం తమ నివాస ప్రాంతాలను వదిలి వెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు గాలులతో మంటలు ఆర్పడం ఫైర్ ఫైటర్లకు కష్టంగా మారింది.

News January 14, 2025

పాకిస్థాన్‌కు రోహిత్ శర్మ?

image

<<14970733>>ఛాంపియన్స్ ట్రోఫీ<<>> ప్రారంభానికి ముందు IND కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ICC టోర్నీల ప్రారంభానికి ముందు హోస్ట్ నేషన్‌లో అన్ని జట్ల కెప్టెన్లు ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఈసారి CTని పాక్ హోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి రోహిత్ వెళ్తారా? లేదా ఫొటో షూట్‌ను వేరే చోట నిర్వహిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

News January 14, 2025

కొత్త రైలు ఇంజిన్‌తో ప్రపంచాన్ని స్టన్‌చేసిన భారత్!

image

భారత్ మరో అద్భుతం చేసింది. US సహా ప్రపంచాన్ని స్టన్‌ చేసింది. తొలిసారిగా 1200 హార్స్‌పవర్‌తో నడిచే హైడ్రోజన్ రైల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. మరికొన్ని రోజుల్లోనే ట్రయల్ రన్ చేపట్టనుంది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, జర్మనీలోనే ఇలాంటి రైలు ఇంజిన్లు ఉన్నాయి. వాటి సామర్థ్యమూ 500-600HPS మధ్యే ఉంటుంది. భారత్ మాత్రం 1200HPS, 140KMSతో అబ్బురపరిచింది. వీటికి డీజిల్, కరెంటు అవసరం లేదు. కాలుష్యం వెలువడదు.