News September 8, 2024

వరదలకు 45 మంది మృతి: రాష్ట్ర ప్రభుత్వం

image

AP: రాష్ట్రంలో వరదల కారణంగా 45 మంది మరణించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది, గుంటూరులో ఏడుగురు మరణించారని పేర్కొంది. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, 3,913 KMల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నట్లు తెలిపింది. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడినట్లు వెల్లడించింది.

Similar News

News March 19, 2026

ఇకపై AP సేవ పోర్టల్‌తో వారికి పథకాలు

image

AP: భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను వేగంగా, పారదర్శకంగా AP సేవ పోర్టల్‌ ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివాహ కానుక, ప్రసూతి ప్రయోజనం, సహజ మరణం పథకం, అంత్యక్రియల సమయంలో ఆర్థికసాయం అందించేందుకు ఓకే చెప్పింది. ఈ 4 పథకాల అమలుకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమల్లోకి వచ్చాయని.. గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించింది.

News March 19, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పబ్లిక్ టాక్

image

డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్‌ అభిమానులను అలరించేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను తెరకెక్కించారని బెనిఫిట్ షో చూసిన పలువురు ప్రేక్షకులు తెలిపారు. పదునైన మాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయన్నారు. పవన్ ఎనర్జీ, డాన్సులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని పేర్కొన్నారు. కథలో కొత్తదనం లేకపోవడం నిరాశ పరుస్తుందని మరికొందరు అన్నారు. కాసేపట్లో Way2News రివ్యూ&రేటింగ్.

News March 19, 2026

ఆ ఒక్క థియేటర్‌లోనే పార్కింగ్ ఫీజు రద్దు

image

TG: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నిషేధం కేవలం పిటిషనర్‌ పేర్కొన్న కోణార్క్(HYD) థియేటర్‌‌‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. పార్కింగ్ ఫీజుకు అనుమతినిచ్చే GO 121 చట్టబద్ధతపై సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని సూచించింది. దీంతో ఇతర థియేటర్ల యాజమాన్యాలకు పెద్ద ఊరట లభించినట్లయింది.