News June 20, 2024

రోజుకు 464 మంది చిన్నారులు చనిపోయారు!

image

వాయు కాలుష్యం వల్ల 2021లో మన దేశంలో రోజుకు సగటున 464 మంది ఐదేళ్లలోపు చిన్నారులు చనిపోయారు. అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (సోగా) 2024’లో ఈ విషయం వెల్లడైంది. 2021లో దాదాపు 1.7 లక్షల మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. వాయు కాలుష్యం వల్ల న్యుమోనియాతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి ఆస్తమా సోకుతున్నట్లు తేలింది.

Similar News

News September 19, 2025

పెద్దపల్లి: బాలల భవిష్యత్తుకు ఆరోగ్య భద్రతా కవచం DEIC

image

PDPL జిల్లా ఆసుపత్రిలో 2024లో స్థాపించిన DEIC పిల్లల ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద 18ఏళ్ల లోపు పిల్లలకు ముందస్తు గుర్తింపు, రిఫెరల్, సమగ్రసేవలు అందిస్తోంది. వైద్య, డెంటల్, ఆడియోలజీ, స్పీచ్, సైకాలజీ, విజన్, స్పెషల్ ఎడ్యుకేటర్ సేవలందిస్తూ ఇప్పటివరకు 1,881ప్రత్యేక విద్య,1,469డెంటల్,1,499 ఆడియోలజీ,1,824సైకాలజీ,1,002 ఆప్టోమెట్రీ కేసులను పరిష్కరించింది.

News September 19, 2025

SMలో ప్రభాస్ Vs దీపిక ఫ్యాన్స్ వార్

image

ప్రభాస్ ‘కల్కి-2’లో <<17748690>>దీపికను<<>> పక్కనపెట్టడంతో ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ మధ్య SMలో వార్ జరుగుతోంది. దీపిక గొంతెమ్మ కోరికలు కోరతారని, పని గంటల పేరుతో ఇబ్బంది పెడతారని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. అందుకే వర్క్‌పై ‘ఎక్కువ కమిట్‌మెంట్’ లేదనే కారణంతో పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే కల్కి-1 సమయంలో ప్రెగ్నెంట్ అయినా దీపిక నటించారని, అంతకంటే ఇంకేం కమిట్‌మెంట్ కావాలని ఆమె మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదంపై మీ కామెంట్?

News September 18, 2025

అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడు అరెస్ట్

image

IPL మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు, వ్యాపారవేత్త సమీర్‌ మోదీ ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఆయన్ను ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో సమీర్‌తో సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఒకరోజు జుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో సదరు మహిళ సమీర్‌ను రూ.50కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.