News February 7, 2025

అమెరికాలో 487 మంది భారత అక్రమ వలసదారులు: MEA

image

అనుమతి లేకుండా తమ దేశంలో ప్రవేశించిన 104 మంది భారతీయులను అమెరికా ఇటీవల తిరిగి స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ బహిష్కరణ తుది జాబితాలో మొత్తం 487 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా వెల్లడించారు. సంకెళ్లతో వీరిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. సంకెళ్ల అంశంపై అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామన్నారు.

Similar News

News March 19, 2025

విడాకుల వార్తలు.. హీరోయిన్ ఏమన్నారంటే?

image

భర్తతో విడాకులు తీసుకోనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ భావన ఖండించారు. ‘పర్సనల్ విషయాలను, భర్తతో దిగిన ఫొటోలను నేను సోషల్ మీడియాలో పోస్టు చేయను. అందుకే మేం విడిపోతున్నామని అనుకుంటున్నారు. కానీ మేం సంతోషంగా ఉన్నాం’ అని తెలిపారు. ఈమె తెలుగులో ఒంటరి, మహాత్మా, హీరో చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు. పలు భాషల్లో దాదాపు 70 చిత్రాల్లో నటించారు. 2018లో కన్నడ నిర్మాత నవీన్‌ను పెళ్లి చేసుకున్నారు.

News March 19, 2025

రైళ్లపై 7,971 రాళ్ల దాడులు: అశ్వినీ వైష్ణవ్

image

2023 నుంచి ఈ ఏడాది FEB వరకు వందేభారత్ సహా ఇతర రైళ్లపై 7,971 రాళ్ల దాడి ఘటనలు జరిగినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కేసుల్లో 4,549 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. దాడుల్లో దెబ్బతిన్న రైళ్ల మరమ్మతులకు రూ.5.79 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలను నియంత్రించేందుకు GRP, జిల్లా పోలీసులతో కలిసి RPF పనిచేస్తోందన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.

News March 19, 2025

గేట్‌లో తెలుగు విద్యార్థి సత్తా.. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్

image

AP: నెల్లూరు (D) ఆమంచర్లకు చెందిన సాదినేని నిఖిల్ గేట్‌లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్‌తో మెరిశారు. డేటా సైన్స్, AI టెస్ట్ పేపర్‌లో 100కు గానూ 96.33 మార్కులతో ఈ ఘనత సాధించారు. గతంలో నీట్ పరీక్షలోనూ 57వ ర్యాంకు సాధించిన ఈయన ప్రస్తుతం నోయిడాలో ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే సంస్థలో పని చేస్తున్నారు. AIలో ఎంటెక్ చేయాలన్న తన కల సాకారం చేసుకునే లక్ష్యంతోనే కష్టపడి చదివినట్లు నిఖిల్ వివరించారు.

error: Content is protected !!