News March 13, 2025

జూన్ నాటికి అర్హులకు 5 లక్షల ఇళ్లు: మంత్రి

image

AP: రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక 1.25 లక్షల నిర్మాణాలు పూర్తి చేశామని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను 2026 మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News March 31, 2026

BREAKING: తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయం <<19521864>>పెరిగిన<<>> బంగారం ధరలు సాయంత్రానికి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 600 తగ్గి రూ.1,48,690, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.550 తగ్గి రూ.1,36,300 పలుకుతోంది. అటు కిలో వెండి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.

News March 31, 2026

YouTubeలో ‘ధురంధర్‌-2’ కలకలం

image

బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ధురంధర్-2 మూవీ YouTubeలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీన్ని గమనించిన ఆ మూవీ ఫ్యాన్స్ SMలో పోస్టులు పెట్టారు. దీంతో అప్రమత్తమైన మూవీ టీమ్ పైరసీపై యూట్యూబ్‌ను సంప్రదించింది. వెంటనే స్పందించిన YouTube ఆ వీడియోను తొలగించింది. దీంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 19న రిలీజైన మూవీ రూ.1,300+కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

News March 31, 2026

సల్మాన్ సరసన నయన్.. బ్లాక్‌బస్టర్ కొడతారా?

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమాలో ఫిమేల్ లీడ్ కన్ఫర్మ్ అయింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. SVC బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభంకానుంది. నయన్ ఇప్పటికే షారుఖ్ ‘జవాన్’తో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో సల్మాన్ మూవీపై బజ్ పెరిగింది.