News June 15, 2024
ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్

ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో రాజస్థాన్ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు చేసిన చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించడంలో ఈ నిర్ణయం తోడ్పడుతుందని సీఎం అన్నారు. కాగా ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ 30 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 27 వేల థర్డ్ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
Similar News
News November 10, 2025
అందెశ్రీ ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి: మోదీ

ప్రముఖ రచయిత <<18246561>>అందెశ్రీ<<>> మరణంపై ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు. ‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన.. ప్రజల పోరాటాలకు, ఆకాంక్షలకు గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి ఉంది’ అని పేర్కొన్నారు.
News November 10, 2025
ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

శరీర పెరుగుదలకు ఎముకలు బలంగా ఉండటం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ 15-20 నిమిషాలు సూర్యకాంతిలో ఉంటే ఎముకలు బలంగా ఉంటాయని అంటున్నారు. క్రమం తప్పకుండా వాకింగ్, యోగా చేయాలని సూచిస్తున్నారు. స్మోకింగ్, ఆల్కహాల్, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని లేకుంటే ఎముకల సాంద్రత తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
News November 10, 2025
భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

<


