News June 15, 2024
ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్

ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో రాజస్థాన్ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు చేసిన చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించడంలో ఈ నిర్ణయం తోడ్పడుతుందని సీఎం అన్నారు. కాగా ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ 30 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 27 వేల థర్డ్ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
Similar News
News October 25, 2025
డాక్టర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఎంపీపై ఆరోపణలు!

మహారాష్ట్రలో <<18091644>>చేతిపై సూసైడ్ నోట్<<>> రాసి మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో 4 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. ‘పోలీసు కేసుల్లో నిందితులకు ఫేక్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. చాలా మందిని వైద్య పరీక్షలకూ తీసుకురాలేదు. ఒప్పుకోలేదని వేధించారు. ఇలానే ఓ ఎంపీ, ఆయన ఇద్దరు సహాయకులు కూడా బెదిరించారు’ అని అందులో పేర్కొన్నారు.
News October 25, 2025
195 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమరాట్లో 195 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్ అప్రెంటిస్లు 40, డిప్లొమా అప్రెంటిస్లు 20, ట్రేడ్ అప్రెంటిస్(ITI) 135 ఉన్నాయి. ITI, డిప్లొమా, ఇంజినీరింగ్లో కనీసం 70% మార్కులతో పాసై ఉండాలి. వయసు 18ఏళ్లు నిండి ఉండాలి. వెబ్సైట్: https://www.drdo.gov.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 46

1. రామాయణంలో జటాయువు సోదరుడి పేరేంటి?
2. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికిన పర్వతం ఏది?
3. నాగుల చవితి ఏ మాసంలో వస్తుంది?
4. ఇంద్రుడికి గురువు ఎవరు?
5. అష్టదిక్పాలకులలో ఉత్తర దిక్కును పాలించేది ఎవరు?
✍️ సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>


