News April 2, 2024

500 మంది ఉద్యోగులకు బైజూస్ ఉద్వాసన

image

ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోతున్న ఎడ్‌టెక్ సంస్థ బైజూస్.. తాజాగా 500 మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగం కోల్పోయినవారిలో సేల్స్, మార్కెటింగ్ విభాగాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. పని తీరు సరిగా లేని వారిని తొలగిస్తున్నట్లు ఫోన్‌లోనే తెలియజేసినట్లు నేషనల్ మీడియా తెలిపింది. నోటీస్ పీరియడ్ ఇవ్వలేదని, పనితీరు మెరుగుపరుచుకునే అవకాశమూ కల్పించలేదని ఉద్యోగులు వాపోతున్నారు.

Similar News

News February 7, 2026

ట్రేడ్ డీల్.. మన రైతుకు రక్షణ!

image

అమెరికాతో ట్రేడ్ డీల్‌లో పలు వ్యవసాయ ఉత్పత్తులను మినహాయించారు. US నుంచి ఎగుమతయ్యే మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాల్(ఫ్యూయల్), పొగాకు, పలు కూరగాయలు, మాంసంపై గతంలో ఉన్న రూల్స్ కొనసాగుతాయి. వీటిపై టారిఫ్ డిస్కౌంట్స్ ఉండవు. US వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే భారత రైతులపై పెను ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో వ్యవసాయ, పాల ఉత్పత్తులను డీల్‌లో చేర్చలేదు.

News February 7, 2026

వెనక్కి తగ్గిన ‘జన నాయగన్’ టీమ్?

image

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 9న రావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే CBFC సూచనల మేరకు పలు మార్పులకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 19 లేదా 20న సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన కోసం విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు

News February 7, 2026

వైభవ్‌ను అరెస్ట్ చేసి వారిని కాపాడాలని పోస్ట్.. తర్వాత

image

హరారే వేదికగా నిన్న జరిగిన U-19 WC 2026 ఫైనల్‌లో చెలరేగి ఆడిన భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలని ఐస్‌ల్యాండ్ క్రికెట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘ఎవరైనా వైభవ్‌ను ఇప్పుడే అరెస్ట్ చేయండి. గ్రౌండ్‌లో ఇంగ్లండ్ బౌలర్లపై ఈ ఊచకోత ఎక్స్ రేటెడ్’ అని పేర్కొంది. మ్యాచ్‌ జరుగుతుండగా సరదాగా చేసిన ఈ ట్వీట్ SMలో వైరలైంది. WC విజయం అనంతరం టీమ్‌ఇండియా, వైభవ్‌ను అభినందిస్తూ మరో పోస్ట్ పెట్టింది.