News May 24, 2024
ఓటుకు రూ.5,000.. ముగ్గురు టీచర్ల సస్పెండ్

AP: ప్రకాశం జిల్లా దర్శిలో ఓటు వేసేందుకు ఓ పార్టీ నుంచి పోస్టల్ బ్యాలెట్కు రూ.5,000 తీసుకున్న కేసులో ముగ్గురు టీచర్లను కలెక్టర్ దినేశ్ కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణకుమారి ఉన్నారు. కాగా ఇటీవల ఇదే తరహాలో పోస్టల్ బ్యాలెట్కు రూ.5,000 తీసుకున్నట్లు తేలడంతో మంగళగిరి ఎస్సై ఖాజాబాబును ఐజీ <<13278620>>సస్పెండ్<<>> చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 17, 2026
TGRJC-CET-2026 నోటిఫికేషన్ విడుదల

TG: రాష్ట్రంలో 35 గురుకుల జూ.కాలేజీలు, 93 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశానికి ‘TGRJC-CET-2026’ నోటిఫికేషన్ విడుదలయింది. MPC, BPC, MEC, CEC గ్రూప్స్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టు మే3న నిర్వహిస్తారు. APR15 వరకు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయొచ్చు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు చేయాల్సిన వెబ్సైట్: https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/
News March 17, 2026
మా కూతురు పెళ్లి లవ్ జిహాదే.. మోనాలిసా పేరెంట్స్ ఫిర్యాదు

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా పెళ్లి <<19360382>>లవ్ జిహాదే<<>> అంటూ ఆమె తల్లిదండ్రులు మండలేశ్వర్ (MP) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తి నటన పేరుతో తమ కూతురిని ప్రలోభపెట్టి పెళ్లి చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు కూతురు తిరిగి రాకుంటే తాను చనిపోతానని మోనాలిసా తల్లి గుండెలు బాదుకుంటోంది.
News March 17, 2026
బెంగాల్లో బిగ్గెస్ట్ ఫైట్.. మమత vs సువేందు

పశ్చిమ బెంగాల్లో మరోసారి హైవోల్టేజ్ ఫైట్ జరగనుంది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ఒకే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ సౌత్ కోల్కతాలోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. APR 23 నుంచి 29 మధ్య రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను ఓడించిన సువేందు ఈసారి ఆమె సొంత నియోజకవర్గంలోనే పోటీకి దిగడం గమనార్హం.


