News March 12, 2025
వ్యక్తిగత, వృత్తి జీవితం బ్యాలెన్స్ చేయలేక 52శాతం మందిపై ఒత్తిడి

వర్క్-లైఫ్-బ్యాలెన్స్పై వర్టెక్స్ గ్రూప్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని సమతుల్యం చేయలేక 52 శాతం మంది ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలిపింది. 23శాతం ఎక్కువ గంటలు, 20 శాతం 2.5-3.5 గంటలే పనిచేస్తున్నారని పేర్కొంది. ఇండియాలో ఐదుగురిలో నలుగురు కుటుంబ బంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించింది. మరి మీ వర్క్-లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News April 19, 2026
గవర్నర్తో సీఎం భేటీ.. ఎమ్మెల్సీల ఆమోదంపై చర్చ?

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ HYDలోని లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరామ్, అజహరుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏ సభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30 లోపు ఎమ్మెల్సీగా ఎంపిక కాకపోతే ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉంది.
News April 19, 2026
SRH బ్యాక్ బోన్.. కన్సిస్టెంట్ క్లాసెన్

ఐపీఎల్-2026లో SRH బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచుల్లో వరుసగా 31(22), 52(35), 62(41), 39(33), 40(26), 59(39) పరుగులు చేశారు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో తొలి స్థానంలో(283) కొనసాగుతున్నారు. జట్టు త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడల్లా ఆచితూచి ఆడుతూ, లూజ్ బాల్స్ను బౌండరీకి తరలిస్తూ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకలా నిలుస్తున్నారు.
News April 19, 2026
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ట్వీట్లు

రాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ్టి 2 ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. నిన్న సర్జరీ చేయించుకున్న Dy.CM పవన్ వేగంగా కోలుకోవాలని YCP చీఫ్ జగన్ ట్వీట్ చేయగా, పవన్ థాంక్స్ చెప్పారు. ఇక జగన్ తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి లోకేశ్ విషెస్ తెలిపారు. నిత్యం రాజకీయాల్లో ఉప్పు, నిప్పులా పోట్లాడుకునే నేతలు హుందాతనం చూపడం రాజకీయాల విలువలను పెంచుతాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


