News February 21, 2025
55 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు

AP: రాష్ట్రంలోని బోధన, ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న 55 మంది వైద్యులపై వేటు పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 78మంది వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నారని 2023లో సామాజిక కార్యకర్త కర్నూలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని DMEని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు 78మందికి DME షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో ఇప్పటి వరకూ 55మంది స్పందించకపోవడంతో విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News October 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 36 సమాధానాలు

1. దశరథుడి తల్లి ఇందుమతి.
2. పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంటారు.
3. విష్ణువు ధనస్సు పేరు ‘సారంగం’.
4. తెలంగాణలోని భద్రాచలం ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది.
5. శుక అంటే చిలుక అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 15, 2025
బిహార్ ఎన్నికలకు 12 మందితో BJP రెండో జాబితా

బిహార్ ఎన్నికలకు BJP 12 మంది అభ్యర్థులతో రెండో విడత జాబితాను విడుదల చేసింది. NDAలోని పార్టీలతో ఒప్పందంలో భాగంగా BJP 101 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటివరకు 83 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయగా ఇంకా 18 సీట్లకు ప్రకటించాల్సి ఉంది. కూటమిలోని జేడీయూ 48 మందితో జాబితాను ప్రకటించింది. మరోవైపు JSP 51 స్థానాలకు, ఆమ్ ఆద్మీ పార్టీ 59 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి.
News October 15, 2025
సాయంకాలం నిద్రపోతున్నారా?

పగలు ముగిసి, రాత్రి మొదలయ్యే సమయంలో దేవతలందరూ శివ తాండవ వీక్షణలో తన్మయత్వం పొందుతూ ఉంటారు. అందువల్ల దైవ రక్షణ ప్రభావం కొంత మేర తగ్గుతుంది. ఈ అవకాశాన్ని అసుర శక్తులు వాడుకుంటాయి. ప్రజలను బాధించడానికి నిద్ర రూపంలో మనలోకి ప్రవేశించాలని చూస్తాయి. ఈ బలహీనతలకు మనం లొంగితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ వేళలో నిద్ర పోవద్దని పెద్దలు అంటుంటారు. * మరిన్ని ధర్మ సందేహాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.