News February 21, 2025
55 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు

AP: రాష్ట్రంలోని బోధన, ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న 55 మంది వైద్యులపై వేటు పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 78మంది వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నారని 2023లో సామాజిక కార్యకర్త కర్నూలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని DMEని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు 78మందికి DME షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో ఇప్పటి వరకూ 55మంది స్పందించకపోవడంతో విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News March 15, 2025
గ్రహాంతరవాసులపై షాకింగ్ విషయాలు

గ్రహాంతరవాసులున్నారా అన్న ప్రశ్నకు అమెరికా మాజీ నిఘా, సైనికాధికారులు ‘ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్’ అనే డాక్యుమెంటరీలో సంచలన విషయాలు వెల్లడించారు. ‘1940ల నాటి నుంచీ గ్రహాంతరవాసులు గుర్తుతెలియని ఎగిరే వాహనాల్లో(UAP) భూమిపైకి వస్తున్నారు. మన సాంకేతిక పురోగతిని పరిశీలిస్తున్నారు. వారు వచ్చే వాహనాలు గంటకు 50వేల కి.మీ పైగా వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటిని మానవమాత్రులు తయారుచేయలేరు’ అని స్పష్టం చేశారు.
News March 15, 2025
బస్సులు, మెట్రో వినియోగం పెరగాలి: CM రేవంత్

TG: హైదరాబాద్లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని CM రేవంత్ అన్నారు. ‘నగరంలో రోజుకు 1,600 వాహనాలు కొత్తగా రోడ్ల మీదకు వస్తున్నాయి. వాటి రిజిస్ట్రేషన్లతో ఆదాయం వస్తున్నా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. HYDలో ఒక వ్యక్తి వెళ్లినా ప్రత్యేకంగా కారులోనే వెళ్తున్నారు. బస్సులు, మెట్రోను ఉపయోగించుకునే వారి సంఖ్య పెరగాలి. దిల్లీలో కాలుష్యం పెరిగి విద్యాసంస్థలు, కార్యాలయాలు మూసివేశారు’ అని గుర్తుచేశారు.
News March 15, 2025
చిన్న సినిమా.. తొలిరోజే భారీ కలెక్షన్లు

చిన్న సినిమాగా విడుదలైన ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. ప్రీమియర్స్, తొలి రోజు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇందులో షేర్ దాదాపు రూ.4.5 కోట్ల వరకు ఉంటుంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.7 కోట్లు కాగా ఫస్ట్ డేనే సగానికి పైగా రికవరీ చేయడం విశేషం. మరి మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.