News September 7, 2024
హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్!

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 58.59 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. నేషనల్ జుడీషియరీ డేటా గ్రిడ్ సమాచారం ప్రకారం.. వీటిలో 30 ఏళ్లకు పైగా నలుగుతున్న కేసులు 62వేలు. 20 నుంచి 30 ఏళ్లుగా హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య 2.45 లక్షలు. 3 కేసులు 1952 నుంచి, 4 కేసులు 1954 నుంచి, 9 కేసులు 1955 నుంచి పరిష్కారం కాలేదు. మొత్తంగా 42.64 లక్షల సివిల్ కేసులు, 15.94 లక్షల క్రిమినల్ కేసులు ఉన్నాయి.
Similar News
News February 9, 2026
హైకోర్టులో అంబటి లంచ్ మోషన్ పిటిషన్

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ జరపనుంది. కాగా గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ ఆందోళన సందర్భంగా రాంబాబు దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో విచారణ కోసం రాజమండ్రి జైల్లో ఉన్న ఆయనను గుంటూరు తరలించారు.
News February 9, 2026
హోటల్లో ఒక్క నైట్కి ₹32 లక్షలు.. సాధారణంగా అయితే ₹2 లక్షలే

ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలో AI Impact Summit జరగనుంది. దీనికి 100 దేశాల నుంచి 35,000 మంది అతిథులు వస్తున్నారు. వీరిలో సుందర్ పిచాయ్, ఆల్ట్మన్ వంటి హై-ప్రొఫైల్ వ్యక్తులూ ఉన్నారు. దీంతో దేశ రాజధానిలో హోటల్ రూమ్ల రేట్లు ఆకాశాన్నంటాయి. ఓ ప్రముఖ హోటల్లో ఒక నైట్ లగ్జరీ స్టేకి ట్యాక్సులతో కలిపి ₹32 లక్షలుగా ఉంది. దానికి నార్మల్ రోజుల్లో అన్నీ కలిపి ₹2 లక్షలే. దాదాపు 1500% పెరగడం గమనార్హం.
News February 9, 2026
అమరావతిలో క్వాంటం కంప్యూటర్ల తయారీ: సీఎం

AP: రాష్ట్రంలో ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు జరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కలెక్టర్లతో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ‘అమరావతిలో రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు తయారవుతాయి. మనమే వాటిని ప్రపంచానికి అందిస్తాం. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు మళ్లుతోంది. మనమూ ఆ దిశగా అడుగులు వేయాలి. అధికారులు నెలవారీగా సమీక్షలు చేసుకోవాలి’ అని సూచించారు.


