News September 25, 2024
30 కాదు 59 ముక్కలు.. మహిళ హత్య కేసులో కీలక విషయాలు
బెంగళూరులో 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను 30 ముక్కలుగా <<14164043>>నరికిన<<>> కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వైద్య నివేదికల ప్రకారం 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది భర్తతో విడిపోయిన మహాలక్ష్మి తాను పనిచేస్తున్న మాల్లో టీమ్ లీడర్గా ఉన్న రంజన్తో రిలేషన్లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే మహాలక్ష్మి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం తెలిసి రంజన్ హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.
Similar News
News September 25, 2024
నాణ్యత పరీక్షల్లో 53 రకాల మందులు ఫెయిల్
కొన్ని సంస్థల పారాసెటమాల్ IP 500 MG, విటమిన్ C, D3 షెల్కాల్, విటమిన్ B కాంప్లెక్స్, C సాఫ్ట్జెల్స్ తదితర 53 రకాల మందులు నాణ్యత పరీక్షల్లో విఫలమైనట్టు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. కాల్షియం, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, అధిక రక్తపోటు మందులు Telmisartan ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మందులను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్ తదితర సంస్థలు తయారు చేసినవి. <
News September 25, 2024
హైడ్రాలో 169 పోస్టుల భర్తీ.. ప్రభుత్వం ఉత్తర్వులు
TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రాలో కొత్తగా 169 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను డిప్యుటేషన్పై కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News September 25, 2024
జనాభా వృద్ధిరేటులో తెలుగు రాష్ట్రాలు వెనుకంజ: సర్వే
భారత జనాభా వృద్ధిరేటు (2011-24)లో తగ్గుదల కనిపించినట్లు SBI సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వృద్ధి క్షీణించింది. ఉత్తర్ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు జనాభా వృద్ధిలో 33% వాటాను కలిగి ఉన్నాయి. SBI రీసెర్చ్ ప్రకారం వృద్ధుల జనాభా 2024లో 15 కోట్లు దాటిందని అంచనా. ఇందులో 7.7 కోట్ల మంది మహిళలు, 7.3 కోట్ల మంది పురుషులు ఉన్నారు. వృద్ధుల జనాభా 4.6 కోట్లకు పెరిగింది.