News December 9, 2024
శ్రీవారి దర్శనానికి 6 గంటల టైమ్

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఒక కంపార్ట్మెంటులో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 73,107 మంది దర్శించుకున్నారు. 22,721 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు లభించింది.
Similar News
News December 23, 2025
30ఏళ్లు దాటితే బెల్లీ ఫ్యాట్.. కారణం తెలుసా?

30ఏళ్లు దాటిన తర్వాత మెటబాలిజంలో మార్పులొస్తాయి. ప్రతి పదేళ్లకు ఒకసారి శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. దీంతో రెస్ట్ తీసుకునేటప్పుడు శరీరం ఖర్చు చేసే కేలరీల సంఖ్య తగ్గుతుంది. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ 4-5% పడిపోయి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. డైట్, జీవనశైలిలో మార్పులు లేకున్నా బెల్లీ ఫ్యాట్ ఫార్మ్ అవుతున్నట్టు తాజా స్టడీలో వెల్లడైంది.
News December 23, 2025
సంక్రాంతి బరిలో ముందుకొచ్చిన మూవీ!

ఈ సంక్రాంతికి థియేటర్ల వద్ద సందడి చేయడానికి సినిమాలు క్యూ కట్టాయి. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల నటించిన ‘పరాశక్తి’ సైతం అదృష్టం పరీక్షించుకోనుంది. అయితే రిలీజ్ డేట్పై మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. తొలుత JAN 14 అని చెప్పి తాజాగా JAN 10నే వస్తున్నట్లు ప్రకటించారు. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర తెలుగు చిత్రాల మధ్య ఈ మూవీకి థియేటర్లు దొరుకుతాయో లేదో చూడాలి.
News December 23, 2025
మహిళా క్రికెటర్ల ఫీజులు భారీగా పెంపు

భారత మహిళా క్రికెటర్ల ఫీజులను BCCI భారీగా పెంచింది. ఇకపై వన్డేలతో పాటు మల్టీ డే మ్యాచులకు ఓ రోజుకు(ప్లేయింగ్ 11) రూ.50 వేలు చెల్లించనున్నారు. స్క్వాడ్లోని సభ్యులకు రూ.25 వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12,500 అందించనున్నారు. అదే T20 అయితే రూ.25వేలు చెల్లించనున్నారు. రిజర్వ్లో ఉన్నవారికి రూ.12,500 దక్కనుంది. ప్రస్తుతం వీరికి ప్లేయింగ్ 11లో రూ.20 వేలు, బెంచ్ మీద ఉంటే రూ.10వేలు చెల్లిస్తున్నారు.


