News December 30, 2024
60 మంది బెస్ట్ యాక్టర్స్.. ఇండియా నుంచి ఒక్కరే
ప్రపంచవ్యాప్తంగా 21వ శతాబ్దపు 60 మంది బెస్ట్ యాక్టర్ల జాబితాను యూకేకు చెందిన ‘ది ఇండిపెండెంట్’ పత్రిక విడుదల చేసింది. ఇందులో భారత్ నుంచి ఇర్ఫాన్ ఖాన్ ఒక్కరినే చేర్చింది. ఆయనకు 41వ ర్యాంక్ ఇచ్చింది. 1988లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ 100కు పైగా చిత్రాల్లో నటించారు. పాన్ సింగ్ థోమర్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు, అనేక చిత్రాలకు ఫిల్మ్ఫేర్ పురస్కారాలను పొందారు. ఈయన 2020లో చనిపోయారు.
Similar News
News January 20, 2025
అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడి మృతి
అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన రవితేజ అనే యువకుడు మృతిచెందాడు. చైతన్యపురికి చెందిన రవితేజ 2022లో అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అతడు మరణించాడని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
News January 20, 2025
సైఫ్ ఇంట్లో నేడు క్రైమ్ సీన్ రీక్రియేషన్?
యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఇంట్లో పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేస్తారని సమాచారం. అతడిపై కత్తితో అటాక్ చేసిన షరీఫుల్ను UPలో అరెస్టు చేశారు. అతడిని ఇప్పటికే ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. నేడు భారీ భద్రత నడుమ సైఫ్ ఇంటికి తీసుకెళ్తారని వార్తలు వస్తున్నాయి. నిందితుడు రెక్కీ, దాడికి ప్లాన్ చేసిన తీరును తెలుసుకోనున్నారు. మిస్టరీగా మారిన ఈ కేసులో తేలాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.
News January 20, 2025
పైసా ప్రయోజనం లేకున్నా సొంత ఎలివేషన్లకు బాబు ఖర్చు: వైసీపీ
AP: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా దావోస్ పర్యటనలో ప్రముఖులతో మీటింగులంటూ ఫొటోలతో భారీగా ప్రచారం చేసుకుంటారని వైసీపీ విమర్శించింది. వారు చెప్పినట్లుగా ఒక్క ఐటీ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు కాలేదని దుయ్యబట్టింది. మరోసారి చంద్రబాబు దావోస్ పర్యటనతో రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేకపోయినా ఆయన సొంత ఎలివేషన్లకు ఏమాత్రం కొదవ లేకుండా భారీగా ఖర్చు చేస్తున్నారని మండిపడింది.