News January 9, 2025
భూకంపం తర్వాత 646 ప్రకంపనలు

ఈ నెల 7న టిబెట్-నేపాల్ రీజియన్లో 7.1 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి దాదాపు 126 మంది చనిపోగా, 188 మంది గాయపడ్డారు. భూకంపం తర్వాత నిన్న మధ్యాహ్నం వరకు ఏకంగా 646 ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నివాసాలు కూలిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. ప్రస్తుతం వారికి 4,300 టెంట్లను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
పిల్లలకు SM బ్యాన్పై విధివిధానాలు రూపొందించండి: మంత్రి లోకేశ్

AP: మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయంపై విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ‘సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై మంత్రులతో జరిగిన మీటింగ్లో చర్చించాం. చిన్నారులకు SMను నిషేధించే అంశంపై సింగపూర్, AUS, మలేషియా, ఫ్రాన్స్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, ఫేక్ పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించా’ అని ట్వీట్ చేశారు.
News January 29, 2026
టీమ్ఇండియా ఓటమి.. సూర్య ఏమన్నారంటే?

NZతో <<18988305>>4th T20లో<<>> కావాలనే ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు పర్ఫెక్ట్ బౌలర్లతో బరిలోకి దిగామని IND కెప్టెన్ సూర్య తెలిపారు. ‘మమ్మల్ని మేము ఛాలెంజ్ చేసుకున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బాగా ఆడుతున్నాం. ఛేజింగ్లో 2, 3 వికెట్లు త్వరగా పడితే ఎలా ఆడతారో చూడాలనుకున్నాం. నెక్స్ట్ మ్యాచులోనూ ఛేజింగ్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. దూబేకి తోడుగా ఇంకో బ్యాటర్ ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది’ అని పేర్కొన్నారు.
News January 29, 2026
జనవరి 29: చరిత్రలో ఈరోజు

1912: సుప్రీంకోర్టు 14వ ప్రధాన న్యాయమూర్తి అజిత్ నాథ్ రే జననం
1936: సినీ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం (ఫొటోలో)
1936: సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు జననం
1962: జర్నలిస్టు, ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జననం
2003: నటి పండరీబాయి మరణం
* జాతీయ పజిల్ దినోత్సవం


