News November 18, 2024

రాష్ట్రంలో ఇంటింటి సర్వే 65.02% పూర్తి

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా 75,75,647 నివాసాల్లో సమగ్ర సర్వే పూర్తి అయింది. దీంతో ఇంటింటి కుటుంబ సర్వే 65.02 శాతం పూర్తి అయినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ములుగు జిల్లా 95.3శాతంతో తొలి స్థానంలో నిలిచింది. నల్గొండ 89.1, జనగామ 86 శాతం సర్వేతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. GHMCలో అతి తక్కువగా 44.3 శాతం సర్వే పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News October 21, 2025

జపాన్ ప్రధానిగా సనాయి తకాయిచి ఎన్నిక

image

జపాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. తొలి మహిళా ప్రధానిగా లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నేత సనాయి తకాయిచి ఎన్నికయ్యారు. పార్లమెంట్‌ లోయర్ హౌస్‌లో జరిగిన ఎన్నికలో మొత్తం 465 ఓట్లకుగానూ ఆమె 237 ఓట్లు సాధించారు. ఇక అప్పర్ హౌస్‌లోనూ తకాయిచి ఎన్నిక లాంఛనమే కానుంది. కాగా ఐరన్ లేడీ ఆఫ్ జపాన్’గా గుర్తింపు పొందారు.

News October 21, 2025

కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: రేవంత్

image

TG: నిజామాబాద్‌లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి CM రేవంత్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. HYDలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ప్రసంగించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.

News October 21, 2025

కోళ్లలో తెల్లపారుడు వ్యాధి – నివారణకు సూచనలు

image

కోడి పిల్లల్లో సాల్మొనెల్లా పుల్లొరం బ్యాక్టీరియా వల్ల తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.