News January 5, 2025
ఇజ్రాయెల్ దాడుల్లో 70 మంది మృతి
పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రం చేస్తోంది. శనివారం నుంచి జరిపిన 30 వేర్వేరు దాడుల్లో 70 మంది మృతి చెందారు. గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ను నిలువరించడానికి ఆ దేశ బంధీల వీడియోలను హమాస్ విడుదల చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్కు 8 బిలియన్ డాలర్ల ఆయుధాల సరఫరాకు బైడెన్ అంగీకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా యుద్ధంలో 45,658 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
Similar News
News January 18, 2025
అన్నకు సవాల్ విసిరిన మంచు మనోజ్
మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. నిన్న కుక్క-సింహం అంటూ ట్వీట్స్ చేసుకున్న ఈ అన్నదమ్ములు.. సై అంటే సై అంటూ ఈరోజు మనోజ్ సవాల్ విసిరారు. ‘దా.. కూర్చుని మాట్లాడుదాం. మహిళలు, నాన్న, స్టాఫ్ను పక్కన పెట్టి మనం కలుసుకుందాం. ఒట్టేసి చెబుతున్నా.. నేనొక్కడినే వస్తా. నువ్వు ఎవరినైనా, ఎంతమందినైనా తీసుకొచ్చుకో. లేకపోతే మనం హెల్తీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం’ అని ట్వీట్ చేశారు.
News January 18, 2025
గ్రూప్-2 కీ విడుదల
TG: గ్రూప్-2 ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 సా.5 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో 783 పోస్టుల కోసం గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 నిర్వహించారు. సైట్: <
News January 18, 2025
బీదర్, అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి
బీదర్లో <<15169507>>ఏటీఎం డబ్బులు<<>> చోరీ చేసి, HYD అఫ్జల్గంజ్లో <<15172705>>కాల్పులు జరిపిన<<>> నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. బిహార్కు చెందిన మనీశ్, మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని, ఇటీవల ఛత్తీస్గఢ్లోని ఓ బ్యాంకులో రూ.70లక్షలు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మనీశ్, అతని ముఠా కోసం తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ పోలీసులు గాలిస్తున్నారు.